పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

229


వ.

అని నిశ్చయించి త్రిమూర్తులయందు ముక్తిప్రదుండైన
మూర్తిని విచారించుకొని రమ్మని భృగుమునీంద్రుని నంపఁగ
నమ్ముని సత్యలోకంబున కేగి తపోజనపరివృతుండై కొలువున్న
బ్రహ్మ నీక్షించి మ్రొక్కి యాబ్రహ్మ కూర్చుండు మనకమున్న
కూర్చుండినం జూచి యజునిమనంబునఁ గోపంబు వొడమిన
నాకోపం బడంచుకొని విధాత మాటాడకుండినం జూచి
యాబ్రహ్మ రజోగుణస్వరూపం బిట్టిదనియు నిట్టిరజోగుణ
ప్రధానుండైనవాఁడు మోక్షప్రదుండు గాఁడు గావున
నతనికి భూలోకంబున నాలయం బొక్కెడంగాని లేకుండు
నని నిశ్చయించి యాభృగుమునీంద్రుండు దిగ్గున లేచి కైలా
సంబునకుం బోయి పార్వతీసమేతుండై క్రీడించుచున్న శివుని
ముందు నిలిచినం గని పార్వత లజ్జించె, నప్పు డాశివుండు గాని
తఱి నిట్టిస్థానంబునకు నిమ్ముని రాఁదగునే యని క్రోధోద్రేక
రక్తాక్షుండై చూచుచు మాటాడకుండుటం జూచి యా
రుద్రుని తమోగుణస్వరూపం బిట్టిదని యెఱింగి యిట్టి
తమోగుణుండు ముక్తిప్రదుండు గాఁ. డీతనికి శరీరపూజలేక
లింగపూజ యగుం గాక యని నిశ్చయించి యందుండి
వైకుంఠంబునకు నరిగి యమ్మునీంద్రుడు శేషతల్పంబునందు
రమాసమేతుండై శయనించియున్న యా శ్రీనివాసునివక్షంబు
నందు నిజపదం బెత్తి తన్నుటం జూచి యాహరి దిగ్గున లేచి
యమ్మునికి బ్రణామంబు చేసి యర్ఘ్యపాద్యాదివిధులం
బూజించి కూర్చుండి తన్నుం దన్నిన యమ్మునిపాదంబు తన
తొడపై నిడికొని యొత్తుచు మందస్మితవదనుండై యాభృగు
నీక్షించి యిట్లనియె.

113