పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

224

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


చేసినపుణ్యంబువలన రామచంద్రుండు శంకరధనుర్భగ్నంబు
చేసి సీతను బరిగ్రహించె నంత సౌమిత్రి యూర్మిళను, భర
తుఁడు మాండవిని, శత్రుఘ్నుండు శ్రుతకీర్తిని బరిగ్రహిం
చిరి యనిన జనకుఁడు సంతసించె, ననిన విని శౌనకాదులు
సూతుంగని యిట్లనిరి.

95


క.

కమలాసనుఁడు రథోత్సవ
మమరఁగ శ్రీవేంకటాద్రియం దాహరికిన్
విమలుండై చేసెఁ గదా
కమలాక్షుం డచట నెంతకాలం బుండెన్.

96


క.

అన విని యాసూతుండి
ట్లనియెన్ శ్రీవేంకటాద్రియం దాఢ్యుండై
వనజాక్షుఁడు కలియుగ మడఁ
గిన దనుక యహీంద్రనామగిరిపై వేడ్కన్.

97


సీ.

ప్రాకృతజనులలోపల మెలంగుచు భూమి
        యందుండి శ్రీవేంకటాద్రివిభుఁడు
పరఘనప్రాకృతప్రభలచే దీపించు
        మిహిరాబ్జకాంతులు మెచ్చకుండు
బహురత్నగోపురప్రాకారసౌధము
        లొనయఁ జతుర్ద్వారములును గలిగి
మహనీయమరకతమణితోరణంబులం
        గొమరొందుచున్న వైకుంఠపురము


తే.

దలంచి యచ్చటి నిత్యముక్తులును దాను
జూడఁగోరుచు శేషాద్రి శుభ్రఘోణి