పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

221


క.

చండాలాంగన నొప్పుచు
నుండినకులహీనుఁ డూరకుండక నేవి
ప్రుండ నటంచుం బెట్టిన
పిండంబులఁ గొనరె వానిపిత లయ్యారె.

84


క.

అనఁగ శతానందుం డి
ట్లనె జనకా కపిలతీర్థమందున మొదటన్
మునిఁగిన పుణ్యముచేఁ గై
కొని రాపిండములు వారు కొంకక వింటే.

95


సీ.

ఆపుణ్య మటులుండె నటుగాక యాతని
        మహిమఁ జెప్పెద విసు మఱుదినంబు
పరమముదంబు నాగిరి యెక్కుచుండఁ ద
        త్పర్వతస్పర్శచేఁ బాపమెల్ల
నాతని విడి వాంతమయ్యె భయంపడి
        యప్పాపగహనంబు నప్పుడద్రి
పావకంబు దహింపఁగా వియద్వీథి మం
        టలు మించె నప్పుడు జలజభవుఁడు


తే.

వామదేవాదు లీక్షించి వచ్చి దివిజ
మార్గముననుండి యాశ్చర్యమగ్ను లగుచు
నేమి యీవింత యని మర్త్యు లెంతయు నపు
డద్రినిం గనుచుండిరి యదఱిపడుచు.

86


ఉ.

అప్పుడు వేంకటాచలమహామహిమంబు దవాగ్నిరూపమై
తప్పక విప్రుపాపమును దగ్ధముచేసె నటంచు మాధవున్
గొప్పగ నెంచి శీర్షమునఁ గొల్లఁగఁ బువ్వులవాన నించి యం
దొప్పఁగఁ జూచుచుండి రజుఁ డుర్వికి దా దిగివచ్చి నవ్వుచున్.

87