పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

220

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


సీ.

గురుతరం బగుబ్రహ్మకులమున జనియించి
        కుంతలయమదాని గూడి కులము
వమ్ము చేసుకుని హా యిమ్మెయిఁ గష్టంబు
        గుడుపఁగల్గెను భార్యఁ గూడనైతి
పాపంబు చేసిన పాపహరంబుగ
        శ్రీహరి యింక రక్షింపవలయు
ననుచుఁ బశ్చాత్తాపమును బొంది గొందఱు
        భక్తులౌ రాజులు పరమవేంక


తే.

టాద్రి కరుగుచునుండంగ నరసి తాను
వారివెంబడిఁ జని త్రోవ వారిభోజ
నాంతమున వారియెంగిలి యన్న మలరఁ
దినుచు హరి వేడుచును భక్తిఁ దనరుచంత.

82


వ.

దేహాభిమానంబు వదలి కపిలతీర్థంబున కేతెంచి యాపావన
తీర్థంబునకు మ్రొక్కి, తోడుగవచ్చి రాజు లాపుణ్యక్షేత్రం
బున వపనంబులు చేసుకొని స్నానంబు లాచరించి పితృలకు
శ్రాద్ధంబులు పెట్టి పిండప్రదానంబు సేయుచుండఁ దాను గనుం
గొని బ్రాహ్మణకులోద్భవుండయ్యు నూర కేల యుండవలె నని
తలంచి తనతలిదండ్రులు మృతినొందినవార్త యెఱింగినవాఁ
డగుటం జేసి తానట్లు వపనంబు చేసుకొని తీర్థంబున మునింగి
సంకల్పశ్రాద్ధంబు చేసి మృత్పిండంబులు మంత్రభక్తియుక్తంబు
గఁ బెట్టి తత్పిండంబు లెత్తి తత్తీర్ధంబున విడుచుచుండఁగఁ
బితృదేవత లాపిండంబులం బ్రియంబునఁ గరంబుల నందికొని
రనిన విని జనకుండు శతానందుని గనుంగొని యిట్లనియె.

83