పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

213


నిలుచునని పల్కి చాల కన్నీరు నింపఁ
జూచి శేషునితోఁ దమ్మిచూలి పలికె.

63


క.

విను ఫణివర నీయం దా
వనజదళాక్షుండు గృపను వచ్చి వసింపం
జని నే వెదకెద నిఁక నీ
మనమునఁ జిందింపవలదు మఱి యురగేశా.

64


మ.

హరి నీయందు వసించియుండఁడని నీ కాచింత యేలా? యశో
ధరుఁ డాచక్రధరుండు వచ్చుటకు సంధానంబు గావించెదన్
గిరిరూపంబున నుండు మోడితిని నాఖేదంబు వర్జింపు పం
కరుహాక్షా యని నాత్మ నెంచుచును సౌఖ్యంబొందు నాగాధిపా.

65


క.

హరి నిచటికి రప్పించుట
కరయఁగ నేఁబూటకాపు నైతి నటంచున్
సరసిజగర్భుఁడు శేషుని
శిరములపై నివిరి నమ్మఁజెప్పెను గరుణన్.

66


వ.

అపు డాయురగేంద్రున కభయం బిచ్చి బ్రహ్మేంద్రాదులు నిజ
నివాసనంబులకుం జనిరి. యంత నాశేషుం డప్పుండరీకాక్షునకుఁ
దండప్రణామంబు లాచరించి పర్వతాకారంబు నొందె. నప్ప
ర్వతప్రమాణంబు చెప్పెద వినుము. దశయోజనవిస్తీర్ణంబై
ముప్పదియోజనంబులునిడివి గలిగియుండు నట్టిశేషాఖ్యనొందిన
మహాద్రిఫణప్రదేశంబు వేంకటాద్రియు, మధ్యప్రదేశం
బహోబలంబునుం, బుచ్ఛంబు శ్రీశైలంబును నగుచుండ, సర్వ
క్షేత్రసర్వతీర్థమయం బగుచు సకలఫలధ్రుమపుష్పలతాశోభి
తంబై నానావిచిత్రధాతుప్రకాశం బగుచుండు నయ్యద్రి
యందు సురబృందంబులు తరుబృందంబులై ఋషిసమూ