పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

212

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


వ.

అని యనేకప్రకారంబులం బ్రార్థింప నాశేషుండు కరుణార్ద్ర
చిత్తుండై లోకరక్షణంబు సేయుటకై యొకఫణం బెత్త నప్పు
డప్పవనుం డుప్పొంగి తెప్పున నప్ఫణంబుసందునఁ బ్రవేశించి
నిజబలంబుకొలఁదిన్ వీఁచుచు నంగుష్ఠం బక్కొండపాతునం
గ్రుచ్చి యెత్తి పైకెగరమీటుటంజేసి యప్పుడు వేంకటాద్రి
గాలిపటంబుచందంబున నెగిరి మొఱయుచు గంగానదికి దక్షి
ణంబుగ ద్విశతయోజనదూరంబునం దూర్పులవణాబ్ధికి నైదు
యోజనంబులదూరంబునను సువర్ణముఖరీనద్యుత్తరతీరం
బునకు సార్ధక్రోశదూరంబున నొప్పుపుణ్యకాననమునందుఁ
దననుజుట్టుకొనియున్నశేషునితోడం బడియె. నివ్విధంబున
శేషుం డోడెనని సంతసించుచుం బవనుండు నిజేచ్ఛం జనియె.
జగంబులు కుదిరియుండె. నంత శేషాహి తా నోడుటకుఁ జింతిం
చుచుండఁగ బ్రహ్మేంద్రాదులు వచ్చి శేషు నాదరించి. రందు
బ్రహ్మ యిట్లనియె.

62


సీ.

విను శేష మారుతంబున కోడితి నటంచుఁ
        జింతింపవలదు నీచిత్తమునను
వేంకటగిరిని నీ వంకితంబుగఁ గూడి
        యవనిపై నుండు నీయందుఁ జక్ర
పాణి వసించి ని న్బాలించునని పల్క
        విని ఫణీంద్రుడు చాల విన్న నగుచుఁ
బలికె నిట్లని నేను పవనునితోఁ బంత
        మాడి యోడుటను నాయందుఁ దప్పు


తే.

గలిగె గర్వం బడంగె నాకర్మ మింత
చేసె నిఁక నేల నాయందు శ్రీధరుండు