పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

209


సీ.

అని యివ్విధంబున ననిలుండు వచియింపఁ
        బన్నగేంద్రుఁడు విని వల్కె నిట్లు
పననుఁడా విను వృథా వాగ్వ్రయం బేటికి
        నీవు నే నొకదిక్కు నిలిచి మించి
యెల్లువారలు సూడ మల్లయుద్ధంబును
        జేయుద మప్డు నీచేవ దెలియు
రారమ్మనఁగఁ బెద్దరభసంబు సేయంగ
        విని చక్రి యేతెంచి గనుచునుండ


తే.

నపుడు శేషుండు పవనుండు హరికి మ్రొక్కి
తమవివాదంబు సెప్పి యోదైత్యనాశ
కదనమును జేయవలయు దీర్ఘాయువులుగ
దీవనలొసంగు దయచేసి దేవదేవ.

50


మ.

అని వాతూలుఁడు శేషుఁ డాహవము సేయంబూనువాక్యంబులన్
విని యోచించి వినోదము ల్గనుట కావేళన్ రమేశుండు వా
రిని వారింపక కారణంబొకటి వేరే యుండఁగా వీర లి
ట్లనుచున్నా రిది మంచికార్య మని రోషావేశముం బెంచుచున్.

51


సీ.

కార్యార్థియె రమాకాంతుఁడు నవ్వుచుఁ
        బవనశేషులఁ జూచి పలికె నిట్లు
వినుఁడు మీరిర్వురు వీరాగ్రగణ్యులు
        గావున నొక్క రొక్కరుని గెలువ
నూరక సేయుఁడు ధీరులై వేఱ యు
        ద్ధము సేయఁగాను లోకములు మనవు
గాన నీ కొకయుక్తి నేను జెప్పెద శేష
        విను మది యెట్లనఁ గనకనగము