పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

206

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


మ.

ఘనవజ్రాంగము దీర్ఘవాలము లసత్కాంతు ల్బలస్ధైర్యముల్
మును లెల్లంగని యాంజనేయుఁడు మహాముఖ్యుం డగున్ ధాత్రిపై
నని దీవించుచు మారుతాత్మజున కత్యాసక్తితో నందఱున్
హనుమంతుం డని నామధేయ మిడి రత్యాహ్లాద ముప్పొంగఁగన్.

38


వ.

త్రేతాయుగంబునం దంజనాదేవి తపంబు జేసి పుత్రుని వడసిన
కతన నంజనాద్రి యని ప్రసిద్ధంబయ్యె మఱియును.

39


తే.

ఉరగపతి శేషుఁ డనిలున కోడి ధాత్రిఁ
గనకగిరినాథుఁ డైనవేంకటునితోడ
ద్వాపరమునందుఁ బడి శైలరూప మొందె
నందుచే నది శేషాద్రి యనఁగ నొప్పె.

40


తే.

అనిన విని జనకుం డిట్టులనియె శేషుఁ
డెందు కాపవనుని కోడె నెఱుఁగఁ జెప్పుఁ
డన శతానందుఁ డిట్లనె హరిని జూడ
ననిలుఁ డొకనాఁడు వైకుంఠమునకుఁ బోవ.

41


సీ.

హరిమందిరద్వారమందుఁ గావలియున్న
        శేషుఁ డాపవను నీక్షించి పల్కెఁ
బవనుఁడా నీవు పోవలదు లోనికి నిందె
        నిలువుమంచు వచింప నిష్ఠురముగ
ననిలుఁ డిట్లనియె నే నబ్జాక్షు నీక్షింపఁ
        బోవుచుండఁగ నన్ను నీవు పిలిచి
పోవలదని చెప్పఁగా వశమే నీకు
        నీయెచ్చు నాయెచ్చు నెఱిఁ దలంప