పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

199


చ.

హరి యతఁడంచు నెంచఁదగు నంచుఁ బరీక్షకునై ముదంబునన్
సరవిని మీరలెల్లఁ గన శంకరకార్ముక మక్కజంబుగం
గరమునఁ బట్టి ద్రుంచు బలగౌరవవంతుని కిత్తు సీత నే
నరుదుగఁ బల్కితిం గనుక యట్టిమహాత్యుడు పుట్టియుండునే.

19


సీ.

అను డాశతానందుఁ డాజనకుని చూచి
        పలికె నిమ్మెయి మహీపతివరేణ్య
భూమిజ కనుగుణ్యపురుషశార్దూలుండు
        పుట్టినాఁ డీచింతఁ బెట్టవలదు
సరవిగ నీదు నల్వురకన్యలకుఁ దగి
        యొకరాజుకొమరు లీయుర్వియందు
నలువురుగానె యున్నారు వారలు నీదు
        బాలికామణులఁ జేఁబట్టుకొఱకు


తే.

వేంకటాచలమహిమంబు వినుము కోర్కె
లన్ని సఫలంబు లగుఁగాన నంబుజాస
నాదులకునైన తరమె యయ్యద్రిమహిమఁ
జెప్ప విని మేలునొందిరి క్షితితలేశ.

20


వ.

కావున నచంచలచిత్తవృత్తి నావేంకటాద్రిప్రభావంబును
వినిన సకలాభీష్టంబు లొడఁగూడు నప్పర్వతంబు కృతయుగం
బున వృషభాద్రియనం బ్రసిద్ధినొందుఁ. ద్రేతాయుగంబున
నంజనాచలం బనం బరఁగు. ద్వాపరయుగంబున శేషశైలం
బన నొప్పుఁ. గలియుగంబున వేంకటాచలం బని విఖ్యాతిఁ
గాంచు. ననఁగ నాజనకుండు విని శతానందుని జూచి, యా
శైలంబునకు నీనామంబు లెట్లుగల్గె ననియడిగిన, శతానందుం
డిట్లనియె.

21