పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

194

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


వినఁగోరిన శౌనకముఖ
మునివరులకుఁ జెప్పె మోదముం దనరంగన్.

208


క.

శ్రీవిభ్రాజితచరిత మ
హావిభవోన్నతజగత్రయప్రఖ్యాతా
శ్రీవేంకటగిరినాయక
పావన తఱికుండనృహరి భద్రయశోధీ.

209


మాలినీవృత్తము.

సరసిజదళనేత్రా సన్మునిస్తోత్రపాత్రా
సురవనవరచైత్రాశోకవల్లీలవిత్రా
సురుచికఘనగాత్రా సూరిచిత్తాబ్జమిత్రా
దరహసితసువక్త్రా ధాత్రిసచ్ఛీకళత్రా.

210


గద్యము.

ఇది శ్రీతఱికుండనృసింహకరుణాకటాక్షకలిత కవితా
విచిత్ర కృష్ణయామాత్యతనూభవ వేంకమాంబాప్రణీతం
బైన శ్రీవేంకటాచలమాహాత్మ్యం బను వరాహపురాణంబు
నందుఁ జగ్రరాజదిగ్విజయంబును, శ్రీవైష్ణవధర్మప్రసక్తియు,
విహితసత్కర్మప్రకారంబును, యమనియమాదియోగాభ్యాస
క్రమంబును, శ్రీవేంకటేశాష్టోత్తరశతనామప్రభావంబును,
నైమిశారణ్యనివాసు లగుమునులు వేంకటాద్రికి వచ్చుటయు,
వేంకటేశ్వరుం డామునులకు దర్శనం బిచ్చి సంభావించు
టయు, నంత నమ్మునులు వేంకటేశ్వరునానతిం బడసి నైమి
శారణ్యంబున కేగుటయు, నందు సూతుం గనుంగొని మునులు
విసుతించుటయు, మునిసహితంబుగ శ్రీవేంకటేశ్వరస్వామికి
మంగళాశాసనంబు సేయుటయు ననుకథలం గల తృతీయా
శ్వాసము.