పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

192

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


జరియించుచున్నవి స్వామిపుష్కరిణీ సం
        పూర్ణమైయున్నది భూవరాహ
దేవుఁ డాపడమట దీపించుచున్నాఁడు
        తద్దక్షిణంబునఁ దప్తహేమ


తే.

కుంభముల నొప్పుచుండెడు గోపురములు
మణులచే నొప్పు ప్రాకారమంటపములు
నమఱియున్నవి తన్మధ్యమందు దివ్య
కాంతి నొప్పు విమానంబుఁ గంటిమయ్య.

199


శా.

మే మాదివ్యనిమానమధ్యమున లక్ష్మీకాంతు నీక్షించి త
త్సామీప్యంబుప నిల్చి మ్రొక్కుతఱి నాశ్చర్యంబుగా నంతలో
నేమో మేము శరీరము ల్మఱచి యందింతైన లజ్జింప కా
స్వామిం జూచుచు నాడుచుండితిమయా సంతోష ముప్పొంగఁగన్.

200


క.

అటువలె నాడితి మాపి
మ్మట హరి నర్చించితిమి సమాధానమునం
గుటిలత లేకయ శ్రీవేం
కటపతి మాటాడె జలధిగంభీరముగన్.

201


క.

ఆమధురోక్తులు వించును
మే మచ్చట నుండ మాకు మిత్రునిరీతిన్
నైమిశమున కరుగుండని
యామాధవుఁ డానతిచ్చి యర్చాకృతియై.

202


తే.

మౌనముద్ర ధరించి తా మఱల మాట
లాడకుండిన చక్రమాహాత్మ్య మచటఁ
జూచి గిరి డిగ్గి యెలమి నిచ్చోటి కిపుడు
వచ్చితిమి మేము సద్గుణవ్రాత సూత.

203