పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

185


సాన్నిధ్యముం జేరి స్నానంబు లొనరించి
        యటఁ జని గౌతమియందుఁ గృష్ణ


తే.

వేణియందును గ్రుంకి యావిమలపథము
నందుఁ గల పుణ్యతీర్థములందుఁ గ్రుంకు
లిడుచు సద్భక్తితో వేంకటేశుఁ జూచు
వాంఛతో వచ్చి రమ్మునివర్యు లెల్ల.

178


వ.

శ్రీమద్వేంకటగిరికి ప్రదక్షిణంబుగఁ గపిలతీర్థంబునకు వచ్చి
తత్ప్రముఖంబులైన పుణ్యతీర్థంబులయందు స్నానాదు లొనర్చి
వేంకటాచలారోహణంబు చేసి మేరుగిరితుల్యంబులై సువర్ణ
ప్రభ లొప్పుచున్న శృంగసమూహంబులును, నవరత్నప్రభా
భాసితంబైన సానుదేశంబులును, ఫలపుష్పభరితంబులైన
పావనవృక్షసందోహవిరాజితంబును, గంగానిభంబులైన
నైర్మల్యతీర్థంబులును, శుకపికకలకంఠమరాళమయూర
ప్రముఖనిహంగనికరకోలాహలంబును, కంఠీరవవ్యాఘ్ర
వరాహమదేభభల్లూకమహిషోరగప్రముఖనానాసత్వసంతా
నంబును గరుడగంధర్వకిన్నరాదిదేవగణనివాసంబును
గన్నులపండువుగం జూచుచు సామగానంబు లొనరించుచు
వచ్చి యప్రాకృతజలపూరితంబును, కనకకమలకల్హారకైరవ
నిచయవిరాజితం బగు స్వామిపుష్కరిణిని దర్శనం బొనర్చి
సభామండపంబున నిలిచి శ్రీ వేంకటేశ్వరుదర్శనంబు సేసి
మ్రొక్కులిడి పులకాంకితశరీరులై యానందబాష్పధారాపరి
పూరితనేత్రంబులు గలవారై గద్గదకంఠంబుల ననేకవిధంబు
నుతించి యనంతరంబున.

179