పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

173


దీపంబుకైవడిఁ దేజరిల్లుచు నిస్త
        రంగాబ్ధివలె నంతరంగమందు
గనఁ డొకరూపంబు వినఁ డొకశబ్దంబు
        మొనసిన ఖేచరిముద్ర నంటి


తే.

యచలితానందరసమగ్నుఁ డగుచుఁ జొక్కి
వరమనోన్మణియు న్మధ్యవస్థ లొంది
చలనరహితామనస్కంబజాడ్యనిద్ర
యోగనిద్రయు నారాజయోగి పొందు.

142


వ.

అట్టి రాజయోగికి జాగ్రత్స్వప్నసుషుప్తితుర్యాతుర్యాతీ
తంబులను పంచావస్థలు గలవు. చతుర్వింశతితత్వాత్మకంబైన
దేహంబు తాఁగానని పంచవింశకుం డైనదేహి తానని తెలిసి
నది జాగ్రత్త యగు. మనంబు నింద్రియబృందంబుతో నాత్మ
యందుఁ బొందించి ధ్యానింప నమ్మనంబు సర్వవిషయవాసనా
సంగరహితమై బాహ్యాంతరంబుల మెలఁగు. కేవలబహిర్ము
ఖంబుగాక తన్నుఁ దాను దనరుచుండుట స్వప్నం బగు. నిది
యభ్యసించుచున్న మనంబు బాహ్యమునందు విస్తరిల్లక
సుస్థిరంబై మాయాజాలం బనిత్యం బని సత్యవస్తువందుఁ
బొందుచున్నప్డు బహిర్జ్ఞప్తి వచ్చినం దెప్పున నంతర్ముఖంబై జగం
బనిత్యంబుగ నాత్మ సత్యంబుగ నెఱింగి నిత్యబోధ నొంది
యుండుట సుషుప్తి యగు. జీవేశ్వరభావంబుల నొందునాత్మ
యందు నిల్చిన మనంబు బాహ్యభావనారహితంబై పరంబును
భావించు. నిట్లు పురుషపురుషోత్తమభావంబు లన, నుభ
యాత్మకం బైన చైతన్యంబునం బొంది యమ్మనంబు విషయవాస
నావిముఖంబై సర్వేంద్రియవ్యాప్తులతోడ దేహాభిమా