పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

11

నైమిశారణ్యవర్ణనము

సీ.

జంబీకమందారసహకారమాలూర
        సాలరసాలహింతాలములును
వటబిల్వబదరికాశ్వత్థనందనకుంద
        కురువకక్రముకతక్కోలములును
నారికేళార్జుననారంగబంధూక
        పారిజాతాశోకపాటలులును
కాదంబకాంచనకరవీరపున్నాగ
        కోవిదారమధూకకుటజములును


తే.

మొదలుగాఁగల బహువృక్షములును లతలు
పూఁచి కాఁచి ఫలింప సంపూర్ణమగుచు
సర్వకాలంబులందు వసంతకాల
రమ్యమై యున్న నైమిశారణ్యమునను.

38


క.

సెలయేఱులు కమలాకర
ములు బహుకాసారబృందములు పూర్ణములై
కలకాలము నొకకవిధముగఁ
బొలుపుగఁ బ్రవహించు నచట బుధసేవ్యంబై.

39


వ.

అట్టి నైమిశారణ్యంబునందు శౌనక కపిల గాలవ కౌశిక
పిప్పల గార్గ్య శంఖకుత్స శ్రీవత్స శమీక కణ్వ సుమేధ వాల
ఖిల్యాదిమహామునులు సూతునివలన సకలపురాణంబులు విని
తదనంతరంబున నొక్కశుభదినంబునందు సూతుంజూచి, కథ
నకా భూలోకంబున నూటయెనిమిది తిరుపతులు గల వందు
స్వయంవ్యక్తంబులు, శ్రీరంగంబును, శ్రీముష్ణంబును,
తోతాద్రియుసు, సాలగ్రామంబును, నైమిశంబును, బదరి