పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

172

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


వ్యాపించి యూర్ధ్వగామినియై సర్వసిద్ధిప్రదయగు తత్స్వ
రూపంబు నాత్మయందు భావించుచు ఫాలోర్ధ్వకోల్లాట
మండలంబున స్వస్వరూపమునందు లక్ష్యం బుంచి చూచుట
పరమాంతర్లక్ష్యం బగు. నివ్విధంబున.

139


మ.

అనిశంబున్ భవతారకాఖ్య వరయోగాభ్యాసముం జేయఁగా
మనము న్మారుత మంతరంగమున మర్మజ్ఞత్వముం బొందు నం
దనుకూలం బగు నంతరాత్మ పరమాత్మానందముం బొందు నిం
కొనరంగా నమనస్కయోగవిధము న్నుత్సాహియై చెప్పెదన్.

140


సీ.

ఆత్మాశ్రయములగు నలహంసమార్గంబు
        లకుఁ గుడియెడమల లలితనీల
కాంతులగు నుదకద్యోతులందు భా
        స్వతరదర్పణచ్ఛాయ లమర
వెలుఁగఁగఁ దన్మధ్యములయందు సూక్ష్మత
        సూక్ష్మంబు లైనట్టి సుషిరములను
మానసంబున నిల్ప మాని యంతర్లక్ష్య
        మును బాహ్యదృష్టు లమ్ముల ఘటించు


తే.

నదియ ఘనశాంభవీముద్ర యగుచునుండు
రెండుజాములదనుక కూర్చుండి దీని
నభ్యసింపంగ మానసం బనిలగతుల
నిలుచు నేకాగ్రభావము నిలుచునపుడు.

141


సీ.

వినుకుల బలుకుల న్వివిధచిత్రములైన
        తలఁపులు తనయంద నిలుపుకొంచు
నట పరమాత్మయం దంతరాత్మను గూర్చి
        తా నంద లీనమై తనరి వాత