పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

159


లును బదాఱును హంసలును నాలు గగు సహ
        స్రారంబునందు సహస్రహంస


తే.

లర్పణముగాఁగ రెండున్న ఱైనగడియ
లలవిగడియలు పదియాఱు హంస లొక్క
నాలు గగుచుండు నీరీతి ననుదినంబు
జరుగు నరువదిగడియలై జనుల కెల్ల.

108


వ.

ఇవ్విధంబున నుదయాద్యుదయపర్యంతము నడచుచున్న నిరు
వదియొక్కవేయియు నాఱునూఱుహంసలు నజప యనందగు
నట్టి యజపగాయత్రిమహామంత్రంబు గురుముఖంబుగ నెఱింగి
యరుణోదయంబునఁ బరమశుచి యై పద్మాసనాసీనుఁ డై
కూర్చుండి నాసాగ్రావలోకనుండై సప్తకమలాధిదేవతలకు
న్యాసధ్యానపూర్వకంబుగ నర్పణంబు సేయుచుండుట మంత్ర
యోగం బగు. నింక లయయోగం బెట్లన్న, విజనస్థలంబున
భద్రాసనాసీనుఁడై గూరుచుండి దిగువ నాసికాగ్రంబును జూచు
చుం బైనున్నది సాధించుచుఁ బైనాసికాగ్రంబును జూచుచు
దిగువనున్నది సాధించుచు రెండుతర్జనులచేత రెండుకళ్ల
ద్వారంబులును రెండనామికలతో రెండునాసికద్వారంబు
లును బంధించి శిరంబు వంచి యేకాగ్రచిత్తుండై వివేకుఁడై
యూర్ధ్వంబుగఁ జూడ నది రాథాయంత్రం బనుముద్ర యగుఁ.
దన్ముద్రాభ్యాసంబుం జేయుచున్న బ్రహ్మరంధ్రంబునఁదుఁ
బ్రణవనాదంబు దశవిధంబుగ మ్రోయుచుండు. నది యెట్లన్న
మొదట శింజినీగతియు, రెండవది తరంగఘోషంబు, మూఁడ
వది ఘంటారవంబు, నాల్గవది వేణునాదంబు, నైదవది వీణాస్వ
సనంబు, నాఱవది భేరీధ్వనియు, నేడవది తాళధ్వని, యెనిమిద