పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

154

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


చెమట మర్ధనంబు సేయఁగఁ దనువునకు దృఢత్వలఘుత్వం
బులు పుట్టును. మఱి యీప్రాణాయామముచేత మూఁడు
నెలలు మీఁదట నాడిశుద్ధి గల్గును. నిదియ ప్రాణాయామం
బగు నింకఁ బ్రత్యాహారం బెట్లన్నను.

94


సీ.

శ్రీగురుబోధ విశేషతగలబుద్ధి
        చే మానసమును సుస్థిరము చేసి
యామదియం దింద్రియవ్యాప్తు లడఁగింప
        నందొప్పుగానిల్చు ననిలగతులు
కమఠ మంగములను గదలనీయక కుక్షి
        యందు డాఁచినరీతి నఖిలవిషయ
కరణానిలములఁ జక్కఁగఁబట్టి నిల్పఁగ
        నదియ ప్రత్యాహార మనఁగఁబరగు


తే.

దాన దేహంబు సుస్థిరత్త్వంబు నొందు
దీపితంబుగ నేకాగ్రదృష్టి నిలుచు
దీని సాధించి యటమీఁద ధ్యానయోగ
మెలమి సాధింపవలె నది యెట్టులనిన.

95


తే.

రోషదుర్భావవైకల్యదోషములను
కపటవచనంబులను వీడి గర్వమడఁచి
సద్గురూక్తులు వించును శాంతుఁడగుచు
నెపుడు కరువలినూని సర్వేంద్రియముల.

96


చ.

అపురుపుసంహరించి గురుఁడానతియిచ్చిన లక్ష్యముద్రలం
దుపముగ మానసంబునిడి యొండొకచింతనులేక చిత్తముం
జపలతఁ బొందనియ్యక నుషద్వసజంబులనూని లోనఁ దా
నెపుడు చలింపకున్న మదికింపొనరించెడి ధ్యానయోగియై.

97