పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

152

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


కుడితొడమీఁద నెడమపాదము నునిచి వీఁపుగుండ కుడిచేత
నెడమతొడమీఁదనున్న కుడిపాదము బొటనవ్రేలిం బట్టి
యట్లన వీఁపుగుండ నెడమచేతఁ గుడితొడమీఁదనున్న
నెడమపాదము బొటనవ్రేలంబట్టి హృదయమునందుఁ జుబు
కంబు నునిచి నాసికాగ్రంబు చూచుచున్న దీనివలన వ్యాధులు
నశించు, నిదియ పద్మాసనంబగు. నెడమతొడనడుమ కుడి
పాదము వెలికలనునిచి కుడితొడనడుమ నెడమపాదము వెలి
కల నునిచి హస్తములురెండును రెండుతొడలమీఁద వెలిక
లగ నునిచి నాసాగ్రమునండు లక్ష్యంబుంచి దంతమూలమున
నాలుక హత్తించి వక్షమునందుఁ జుబుకంబు నుంచి మెల్లన
వాయువు నిల్పియున్న, దీనివలన సర్వరోగంబులు నశించు.
నిది మతాంతరపద్మాసనం, బిదియముక్తపద్మాసనంబగు. హస్త
ములు రెండు హత్తించి చిత్తమునందు ధ్యానంబు సేయుచు
నపాననాయువు నూర్థ్వముఖముగ నడుపఁగఁ గుండలిశక్తి
యుక్తమై నిల్పిన ప్రాణవాయువును విడువఁగ నతిశయంబగు,
జ్ఞానబోధ కల్గును, దీనివలన నాడిద్వారములయందు వాయువు
నిల్చును, ఈవిధమునన మరణమునొందిన ముక్తులగుదు రిది
బద్దపద్మాసనం బగు. లింగాండోభయపార్శ్వములయండు నెడ
మకాలిమడమ దక్షిణపార్శ్వము కుడికాలిమడమ నెడమపా
ర్శ్వంబున నునిచి చేతులు రెండు మోఁకాళ్లుమీఁదుగ సాఁచి
వికసింపఁబడినవ్రేళ్లుగ నునిచియున్న, దీనివలన మూలోడ్యా
ణజాలంధరబంధత్రయానుసంధానంబు కలుగు నిది శ్రేష్ఠమైన
సింహాసనంబగు. భూమియందు శవమువలె వెలికలుగఁ
గాళ్లురెండు బొటనవ్రేళ్లు సరిగఁగూర్చుండినయట్లుగ సాఁచు