పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

149


మయంబై న యీశ్వరరూపంబును గురుముఖంబుగ నెఱిఁగి
హృత్కమలమునందు మనంబున ధ్యానించి పూజించుట
యీశ్వరార్చనంబగు. గురువాక్యంబు సత్యంబుగనమ్మి చెప్పిన
నియమంబు తప్పక కష్టంబున కోపినపుడు తపంబగు. జప్యా
జప్యంబులయందుఁ దనకు గురుండుపదేశించిన మంత్రంబు
నిశ్చలుండై విడువక జపంచుట జపంబగు. నీపదియు నియ
మంబులగు. నిట్టియమనియమంబు లిరువదియు నంతశ్శుద్ధి
ప్రదంబులగుం గావున వీనినభ్యసించి యంతశ్శుద్ధి నొంది
కీటాదిజంతువులు మెదలకుండునట్టి విజనస్థలంబునందుఁ
జేలాజిన కుశోత్తరంబుగ నాసనసుఖంబు నిర్మించి యందు
నాసనంబుల నభ్యాసంబు సేయవలయు. నవ్విధం బెట్లనిన.

90


సీ.

పద్మాక్షి విను మేను పదినాల్గులక్షలై
        నట్టియాసనములం దతిశయములు
లీలమై నెనుబదినాలుగాసనములం
        దధికంబు లష్టాదశాసనంబు
లటువంటి యష్టాదశాసనంబులలోన
        నతిశయించినవి సిద్ధాసనంబు
భద్రాసనంబును బద్మాసనంబును
        సింహాససం బని చెప్పఁదగిన


తే.

నాలుగాసనములయందుఁ జాలమేటి
యనఁగ నొప్పుచునుండు సిద్ధాసనంబు
పొలఁతి యష్టాదశాసనంబులవిధములు
వినుము వేర్వేఱఁ జెప్పెద విశదముగను.

91