పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

145


వ.

అనిన విని భూదేవి వైష్ణవధర్మంబునకు సంతసించి జ్ఞానభక్తి
వైరాగ్యంబులు గలవారు కర్మంబులు గ్రమంబున నాచరింప
వలయు ననిన వరాహస్వామి యిట్లనియె.

79


సీ.

భాసురవిజ్ఞానభక్తివైరాగ్యము
        ల్గలిగినవారును గర్మములను
విడువఁగాఁ దగ దది వేదోక్తమార్గంబు
        గాన సల్పం దగు కర్మములను
స్నానసంధ్యాదులు సవనము ల్నిజశక్తిఁ
        గొలఁది సల్పం దగు గోర్కె విడచి
హరి కర్పితం బని యాచరించినయప్డు
        సంతుష్టుఁ డగు నది సత్ఫలంబు


తే.

గనుక విఫ్రులు వేదమార్గక్రమమున
జన్నములు చేసిరేని యీశ్వరుఁడు మెచ్చి
యిష్టఫలముల నవ్వారి కిచ్చుచుండు
నందు జన్నాలు సేయుదు రార్యు లెల్ల.

80


వ.

ఇవ్విధంబున నిష్కామసత్కర్మంబు నాచరింపవలయు మదాజ్ఞో
ల్లంఘనంబు సేసినవారు దోషయుక్తు లగుదురు. గావున
సద్బ్రాహ్మణులు యజనాదిషట్కర్మంబు నాచరింపుదు రందుఁ
గొందఱు బ్రహచర్యాదిధర్మంబు లాచరించి తత్వజ్ఞులై
సన్యసించి కర్మముక్తులై ప్రణవోచ్చారణంబు సేయుచు
సన్యాసవిధిఁ గొన్నియజ్ఞంబు లాచరించి పూర్ణజ్ఞానోదయం
బైనపిదప విధియుతంబుగ దండకమండలువులు విడిచి యవ
ధూతాశ్రమంబు నంగీకరించి శీతోష్ణసుఖదుఃఖాది ద్వంద్వా
తీతుఁడై సచ్చిదానంద సత్యపరిపూర్ణబ్రహ్మానుసంధానంబు