పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

134

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


జక్రరాజుశిరంబుపై సంతసమునఁ
బుష్పవృష్టియుఁ గురిసిరి పొగడి యనిరి.

48


తే.

చక్రరాజేంద్ర నీ విప్డు సకలరిపుల
సమయఁజేసితి నవని సజ్జనులనెల్లఁ
గాచితివి కృపచిత్తుఁడై గానఁ జక్రి
సంతసించెను జయుఁడని శాంతిఁబొంది.

49


వ.

శ్రీవేంకటేశ్వర సన్నిధానంబున కరుగుమని చెప్పి యమరులు
చనిరంతఁ జక్రరాజు యుద్ధంబున మడిసిన చతురంగబలంబుల
నిజప్రభావంబున గ్రమ్మఱ సజీవితులంజేసి కరుణాకటాక్ష
వీక్షణామృత విందు సందోహంబుల వారియందు నొలుక
చేసిన, వారును శాంతింబొంది పూర్వప్రకారంబునఁ జక్ర
రాజు ననువర్తించి కొలిచియుండి రప్పు డుత్తరదిగ్భాగంబు
నందు శ్రీవేంకటాద్రికి వచ్చుభక్తులకు మార్గంబు లేర్పరించి
తన్మార్గంబులయందుఁ బుణ్యాత్ము లైనజనుల నిల్పి వారలం
గాపాడుటకు నం దొక్కని రాజుగఁ జేసి యీశాన్యదిగ్భాగం
బునఁ జెదరియున్న చోరుల నిర్జించి యష్టదిక్కులయందు
నిష్కంటకంబులఁ జేసి దేశంబుల శాంతం బొందించి క్రమ్మఱ
సకలబలంబులతో వేంకటాద్రికి వచ్చి స్వస్వరూపంబున నంత
ర్విమానంబునం బ్రవేశించి శ్రీహరి దక్షిణకరంబున నిలిచి
యుండె నిట్లు దేశంబులు సురక్షితంబులైన వెన్నడి శ్రీస్వా
మికి మహోత్సవంబులు జరుగుచుండెనని చెప్పిన సూతుం
జూచి క్రమ్మఱ శౌనకాదు లిట్లనిరి.

50


సీ.

శ్రీనివాసస్వామి చిత్రచారిత్రముల్
        సలలితకర్ణరసాయనములు