పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

133


నప్పుడు చక్రమహారాజు పావకుఁ
        డనువానిఁ బుట్టించి యరులపైకి


తే.

బంపెఁ దత్పావకుఁడు శత్రుబలముమీఁద
నతిరయంబున సమ్మోహనాస్త్ర మేసె
నపుడు మేనులు మఱచుచు నసురవరులు
తాము దమలోనఁ బోరాడి ధరణిఁ బడిరి.

45


తే.

చక్ర రా జావిధము చూచి జాలినొంది
యిది యధర్మము గనుక నీ వీశరమును
మించనీయక యుపసంహరించుమనిన
పావకుఁడు దాని మరలించి పటిమ మెఱయ.

46


క.

దనుజులపైఁ గ్లౌంచాంబక
మును విడువఁగ నదియు వారిముక్కులు చెవులన్
గొని తఱిగినఁ గోపము పెం
పెనుఁగొన భేరుం డపుడు విభీకరవృత్తిన్.

47


సీ.

పావకుం డనువానిపైఁ బడవచ్చిన
        నప్పావకుఁడు మారుతాస్త్ర మేసె
మూఁడుయోజనముల మొనయుదేహముతోడ
        నాభేరునిం గొని యద్భుతపడ
వేంకటాద్రికిఁ జుట్టి వేడ్కమై మూఁడుమా
        రులఁ ద్రిప్పి కడభూమితలమునందుఁ
బడవేసెఁ బెద్దగుమ్మడికాయ పడినట్లు
        రాక్షసుఁ డరిగెఁ జక్రంబు మించి


తే.

యరుల నందఱఁ ద్రుంచె నయ్యవసరమున
సురవరేణ్యులు మిక్కిలి సొంపుమీరఁ