పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

132

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


లను పిలుచుచుఁ బోయి తద్రణభూమి నీక్షించి సంతసించి
తమలోఁ దా మిట్లు చెప్పుకొనిరి.

42


సీ.

చక్రరాజేంద్రుఁ డిండిక్క్రమంబున సమా
        రాధన మొనరించె రండటంచుఁ
బిల్చుచుఁ గండలుం బ్రేవులు బాగుగ
        భుజియించుచుండెడు భూతములును
బలుమాఱు రక్తంబుఁ దలపుఱ్ఱెలను ముంచి
        పూని పానముసేయు భూతములును
గడుపులు నివురుచు గఱ్ఱునం ద్రేపుచుం
        బొరలుచు లేచెడు భూతములును


తే.

గలిగి రణభూమి యద్భతం బలరుచుండ
నప్పు డావిష్ణుచక్రరా జనఘుఁ డెలమి
నొందె భేరుండు దుఃఖంచి యొప్పమికిని
మఱల హతశేషులను గూడి మారుకొనఁగ.

43


వ.

చక్రరాజేంద్రుండు కనుబొమలు ముళ్లువడం గినిసి భేరుండుని
జూచి హుంకరించి యుద్ధంబునకు సమకట్టు మనఁగ నాభేరుం
డుఁడు వేయిపిడుగులు పడినట్లు బాహాస్ఫాలనం బొనర్చి
మించుటం జేసి తత్సమయంబున.

44


సీ.

ఆకాశ మగలె దిగంతముల్ గ్రుంగెను
        ఘనశైలములు గడగడ వడంకెఁ
దపనచంద్రులగతు ల్దప్పె ఘోరాకారు
        లైనదైత్యులగుండె లదరసాగె
బ్రహ్మాండభాండంబు పగిలినగతి నుండె
        విపరీతవాయువు ల్విసరసాగె