పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

130

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


తే.

చుండె రెండవచండమార్తాండుఁ డనఁగ
నొప్పుచును వేంకటాద్రికి నుత్తరముగ
నుండుకొండలనడుమ మహోగ్రుఁ డగుచు
సరభసంబున నిలిచె నాచక్రరాజు.

37


వ.

అపు డాచక్రరాజు నీక్షించి భీతినొంది కొందఱు రాక్షసులు
తమదొరయగు భేరుండునిచెంతఁ జేరి యిట్లనిరి.

38


సీ.

చండప్రతాపభేరుండ! మహాస్వామి!
        విను మద్భతంబుగ వీరుఁ డొకఁడు
చతురంగబలముల జతఁగూడియున్నాఁడు
        కాలాగ్నిరుద్రులఁ బోలినాఁడు
ఖ్యాతిగ నొకవేయిచేతులు గలవాఁడు
        ఘనరక్తచేలము ల్గట్టినాఁడు
హారకిరీటకేయూరము ల్ధరియించి
        యెక్కువతేరుపై నెక్కినాఁడు


తే.

మించుభానునిగతి వాఁడు మించినాఁడు
వాఁడు భయదాంగుఁడగుచు నున్నాఁడు చూడ
నంచుఁ జెప్పంగ భేరుండుఁ డప్పుడటకు
రక్కసులతోడఁ జని కడురౌద్ర మెసఁగ.

39


క.

ఆచక్రరాజుఁ గనుఁగొని
యాచోటికిఁ దాన రాజు ననుచున్ భేరుం
డేచినకింకను జూచి ని
శాచరుల న్మించి వల్కె శౌర్యోద్ధతుఁడై.

40


శా.

ఓరక్షోవరులార చూచితిరె! వీఁ డుత్సాహము న్మించి న
న్నారూఢాహవమందుఁ గెల్చుటకు నేఁ డాసన్నుఁడై వచ్చినాఁ