పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

129


క.

అని చక్రరాజు వల్కఁగ
వినియె న్బడబాముఖుండు వే సాధనముల్
గొని యాజ్వాలాపాతా
ఖ్యునిరథమును గొట్టి వానిఁ గూల్చెను ధాత్రిన్.

34


ఆ.

తనరె విష్ణుచక్రమని యప్డు వేరొందె
గానఁ జక్రమెత్తి గహనకర్త
యనెడువానిమీఁద ననుపఁగ నాచక్ర
మతనిశిరము పుడమి నడఁగఁగొట్టె.

35


వ.

ఇవ్విధంబు బడబానలంబు సముద్రోదకంబు నింకఁ జేసినచందం
బున వనకర్తసైన్యంబును జక్రరాజశస్త్రాస్త్రంబుల సంహరించెఁ
దద్భూమి నిష్కంటకంబై ప్రకాశించె నప్పుడు చక్రరా
జేంద్రుఁ డరణ్యకంటకవృక్షంబుల నఱికించి సర్వభక్తజనం
బులు శేషాద్రికి వచ్చుటకుఁ దగినమార్గంబుల నేర్పఱచి
తన్మార్గప్రాంతంబులఁ బుణ్యాత్ములైన జనంబుల నునిచి తజ్జనం
బులఁ బాలింపఁదగినరాజునకుఁ బట్టంబు గట్టి ధర్మపరిపాలనంబు
సేయుమని నియమించి యనంతరంబున.

36


సీ.

చక్రరాజేంద్రుడు జయభేరి వేయించి
        చతురంగబలములు సరవిఁ గొల్వ
ధీరుఁడై వాయవ్యదిశ నుండుచోరుల
        సమయించుచును వచ్చి శౌర్య మెసఁగఁ
గంకణరాక్షసగాఢాంధకారంబు
        దట్టమైనట్టి యుత్తరపుదిశకు
నప్పుడ మరలి సహస్రార్కకరముల
        కరణి దీర్ఘసహస్రకరము లమరు