పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

127


తే.

భేరి వేయించి యప్పు డభేద్యవిపుల
విపినదుర్గస్థలంబుల వెదకి వెదకి
చోరులను ద్రుంపఁగాఁ జోరచారు లదిరి
చెదరి తమదొరయగువానిచెంతఁ జేరి.

26


క.

మ్రొక్కుచు నిట్లని రధిపా
యెక్కడనుండియొ దళంబు లీప్రాంతములం
గ్రిక్కిరిసి చోరవీరులఁ
జక్కాడుచు నున్నవారు శౌర్యోన్నతులై.

27


వ.

అనిన విని సమధికకోపావేశంబున.

28


సీ.

శివునిగూర్చి తపంబుచేసి తానెవరిచేఁ
        గూలనివరము గైకొనినవాఁడు
బహుచోరులంగూడి పర్వతాగ్రములందుఁ
        జేరి సాధులను హింసించువాఁడు
పటుశక్తితోగూడి పాంథుల నెసఁగొట్టి
        యమితవిత్తము గూర్చినట్టివాఁడు
కాలకింకరులనఁగాఁ దగినకిరాతు
        లను గూడి గర్వంబు దనరువాఁడు


తే.

వనములందు రిపుఘ్నుఁడన్వాఁడు గన్న
కొడుకు వనకర్తయనువాఁడు క్రోధమెసఁగ
నిక్క పొంగుచు నక్షౌహిణీబలములఁ
గూడి విడి వడివచ్చి దుర్గుణము మెఱయ.

29


క.

కలకలు కొమ్ములు తుడుములు
బలముగ వాయించికొంచుఁ బ్రతివీరులపై