పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

126

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


నీవు మాపాలిటిదేవుఁడవై వచ్చి
        సకలక్రూరాత్ముల సమయఁజేసి
మమ్ముఁ గాపాడితి విమ్మహిఁ బాలింపఁ
        దగినట్టిరాజును దనర నిలుపు


తే.

మనుచు వా రెల్లఁ బ్రార్థింప నపుడు చక్ర
రాజు తద్ధాత్రికిని తగురాజు నొకని
నిలిపి ధర్మంబు దప్పక నీవు జనులఁ
బాలనము సేయుమని చెప్పి బ్రాహ్మణులను.

23


తే.

కాంచి యిట్లనె మీరు సత్కర్మనిష్ఠు
లగుచు జన్నము లొనరింపుఁడంచుఁ బ్రియముఁ
జెలఁగ నందఱు నప్పు డాశీర్వదించి
వీడుకొల్పఁగ నారాజవీరుఁ డపుడు.

24


వ.

దక్షిణప్రాంతగహనంబులయందు వేంకటాద్రికి జనులు వచ్చు
టకుఁ ద్రోవ లేర్పఱచి యాత్రోవలయందు సజ్జనాగ్రేసరులం
బాలింపుమని యచటిసజ్జనునొకని రాజుం జేసి యనంతరంబు.

25


సీ.

అందుండి సకలసైన్యావళులను గూడి
        జయభేరి వేయించి సంతసించి
పైనమై నిఋరుతిప్రాంతదేశములందుఁ
        గదలిపోవుచును దుర్గస్థలముల
శోధించి శోధించి చోరులనెల్లను
        బరుగిడకయ చంపి పశ్చిమమున
కరిగి మహోన్నతుఁ డై నిజగంధర్వ
        బలములతో నందు నిలిచి కదన