పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

125


వాఁడు తద్దుష్టులపై నర్ధచంద్రబాణప్రయోగంబు చేసి
యందఱ రెండేసిఖండంబులు గావించె నంత హతశేషులైన
వారు కొందఱు వెఱచి పఱచి గుహారణ్యంబుల డాఁగినంజూచి
చక్రరాజేంద్రుఁడు చిత్రబాణప్రయోగంబు సేయ డాఁగిన
శాత్రవులఁ జక్కాడి వచ్చె నంత దక్షిణభూమి నిష్కంటకం
బయ్యె నంత దేవతలు చక్రరాజశీర్షంబునఁ బుష్పవర్షంబు గురి
యించి యనేకప్రకారంబుల వినుతించి యిట్లనిరి.

21


సీ.

చక్రరాజోత్తమ సకలపాపాత్ముల
        సమయించి యిచ్చట సాధువులను
రక్షించితివి నీపరాక్రమం బెంతయు
        శేషునికైనను జెప్పఁదరమె
పరఁగ శేషాద్రికిఁ బశ్చిమోత్తరములఁ
        జోరులు క్రూరులున్నారు నీవు
వారల సమయించి వసుధామరాదిస
        జ్జనులను రక్షించు చక్రరాజ


తే.

యనుచుఁ బ్రార్థించి దేవత లరిగి రట్లు
చక్ర మచ్చోట శత్రుశేషంబు లేక
యంతమొందింపఁగాఁ జూచి సంతసించి
బ్రాహ్మణులు వచ్చి యాచక్రరాజుఁ గాంచి.

22


సీ.

వినుతించి పల్కిరి విమలాత్మ! యీ దేశ
        మందు ధర్మాత్ముఁ డైనట్టిరాజు
గలుగనికతన దుష్కరులై చోరులు
        బాధించుచుండిరి బ్రాహ్మణులను