పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

124

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


డును, కాలాంతకుండును, రణఘ్నుండును, చక్రరాజేంద్రు
నానతిరీతిఁ గరవాలాద్యాయుధంబులం బూని శత్రుబలం
బులపై బడి యప్పాతకులం జూచి యిట్లనిరి.

19


సీ.

పాపాత్ములార సద్బ్రాహ్మణోత్తములను
        జెఱచి యాచారము ల్జెలఁగ నడఁచి
బాధింపుచును ధర్మపథమును విడనాడి
        జీవనంబులు లేక చెఱచినట్టి
క్రూరాత్ములార మీకుం గడుమేల్కాల
        మిదివఱకుండె నిం కెందు డాఁగె
దరు రండు యమలోకదారిఁ జూతురు మిమ్ము
        ఖండించి కాకులుగ్రద్దలకును


తే.

విందుపెట్టెద మావల విప్రకోటి
కమితసౌఖ్యంబు గల్గింతు మాశ విడుఁడు
సారెసారెకు మాకంటె శౌర్యవంతు
లెందు లేరని వల్కంగ నేల యంచు.

20


వ.

అతిభీషణాకారులై యస్త్రశస్త్రంబుల నద్దురాత్ముల నొప్పిం
చినఁ దలంగివోక యంగవంగాదిరాక్షసులు స్ఫులింగాక్షుల
మీఁదఁ బడి ఘోరయుద్ధంబు సలుప నాస్ఫులింగాక్షుండు
మార్కొని యంగుఁడనివానిం బరిమార్చె, బలాద్యక్షుండు
వంగుండనువాని ద్రుంచె, జ్వాలాకేశుండు పుళిందుం డను
వాని జక్కాడె, కాలాంతకుండు బిడాలుం డనువాని నేలం
గూల్చె, రణఘ్నుం డనువాఁడు చాలకుం డనుదుష్టుని
వధించె, నంత వారిభటు లాహాకారంబులు సేయుచుఁ జక్ర
రాజబలంబునంబడినఁ దచ్చక్రరాజాజ్ఞచేత హయశిరుండను