పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

123


వచ్చుచునుండఁగ నచ్చటచ్చటఁ గల
        సజ్జనులెల్లరు చక్రరాజు
నీక్షించి మాపాలి యీశ్వరుడై వచ్చి
        రక్షింపఁబూనెనో కాంక్షఁ జేసి


తే.

యనుచు ముదమందుచుండఁగ నపుడు మొనసి
చాలకుం డనువాఁడు బిడాలకుండు
ననెడువాఁడు పులిందులు తనరఁ జూచి
యాయుధంబులఁ బూని చక్రాధిపతిని.

16


వ.

మార్కొన వచ్చి తమకుఁదా మిట్లనుకొనిరి.

17


సీ.

ఈరీతి మన నెదిరించినశత్రుల
        నదలించి నేఁ ద్రుంతు ననియె నొకఁడు
గంధేభములఁ దురంగంబులనెల్లను
        మొనసి ధాత్రిని గూల్తు ననియె నొకఁడు
కాల్బలంబులఁ గూల్తు గములుగ వచ్చిన
        నవనిపైఁ బడిపోవ ననియె నొకఁడు
రథముపైఁ గడుగొప్పరాజుగ వచ్చెడు
        ఘనుని ద్రుంచెద నెంచ కనియె నొకఁడు


తే.

కరుల హయముల మితిలేనికాల్బలముల
రథముపై వచ్చుమగవానిఁ బృథుబలాన
నేను సమయింతు నొక్కఁడ పూని లావు
మెఱయఁజేయంగ వచ్చినఁ గఱకుఁ జూపి.

18


వ.

ఇట్లు పంచమహాపాతకు లైనయంగవంగపుళిందబిడాలచాల
కులు ప్రచండబలంబునఁ జక్రరాజజలంబున కెదురేగి హుంక
రించి స్ఫులింగాక్షుండును, బలాధ్యక్షుండును, జ్వాలాకేశుం