పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

119


సీ.

పటిమమీఱ సహస్రబాహుఁడై మకుటాది
        రక్తభూషణములు రక్తవర్ణ
చేలంబులను దాల్చి కాలాగ్నిసదృశుఁడై
        దంష్ట్రాకరాళవక్త్రంబు మెఱయ
వేడ్క రథంబెక్కి వివిధసాధనముల
        ధరియించి వెడలి గంధర్వగణము
లలఘుముద్గరపట్టిసాద్యాయుధంబులు
        గొని తనవెంబడి జనుచునుండఁ


తే.

గుముదుఁడనువాఁడు జ్వాలాముఖుండు సకల
సైన్యములనెల్ల నడపింప సామజాశ్వ
వారములతోడ ఘనరణభేరి మొరయ
నిఖిలవాద్యరవంబులు నింగి కెగయ.

3


వ.

ఇవ్విధంబున సంగరోన్ముఖుండై చక్రరాజశేఖరుండు శేషా
చలంబు మొదలు పూర్వసముద్రపర్వతంబున నాక్రమించి
కొని సాధుజనులను బాధించు చోరసమూహంబుల వెదకి
వారి కుటుంబములతోడ నశేషంబుగ సంహరించి దేశబాధ
నివారించిన, చక్రరాజు సాన్నిధ్యంబునకు వచ్చి తద్దేశవాసు
లగు సాధుజనులు వినుతించి యిట్లనిరి.

4


తే.

ఓమహారాజ యీభూమి కొక్కప్రభువు
లేనికతముస నయ్యయో మానవులను
జాల వేధించుచోరులఁ జంపితీవు
బ్రోచితివి మమ్ము సుఖముగఁ బుణ్యపురుష.

5


క.

యెక్కడనుండియొ యిచటికి
మక్కువతో వచ్చి నీవు మాజీవనముల్