పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

116

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


తీర్థోత్తరభాగంబునందుఁ గొందఱు మునులు తపంబు లొన
రింప నేగిరి. యియ్యుత్సవక్రమం బెవరేని చదివిన వీనుల
వినిన నాయురారోగ్యభాగ్యంబులు చేకూరునని చెప్పిన
సూతుంజూచి శౌనకాది నీంద్రు లిట్లనిరి.

142


క.

సుందరవిగ్రహ ఘనతర
మందరగిరిధర సమస్తమౌనిహృదజ్జా
నందకర వేంకటాచల
మందిన సురరాజవినుత మాయాతీతా.

143


మాలిని.

సురుచిరగుణహారా శుభ్రకీర్తిప్రచారా
వరజలధిగభీరా వాసవారిప్రహారా
దురితచయవిదారా దుఃఖసంసారదూరా
గురుతరగిరిధీరా క్రూరగర్వాపహారా.

144


గద్యము.

ఇది శ్రీతఱికుండ నృసింహ కరుణాకటాక్షకలిత కవితా
విచిత్ర కృష్ణయామాత్యతనూభవ వేంకమాంబాప్రణీతం
బైన శ్రీవేంకటాచలమాహాత్మ్యంబునందు వరాహపురా
ణంబున దేవేంద్రాదులు క్షీరాబ్ధిప్రముఖస్థలంబులయందు
హరిని వెదకుటయు, నారదప్రేరితులయి బ్రహ్మలోకంబున
కరుగుటయు, బ్రహ్మతోడ దేవేంద్రాదులు హరిని వెదకుటకు
వేంకటాచలారోహణంబు సేయుటయు, దశరథుండు వసిష్ఠ
యుక్తుండై వేంకటాద్రికి వచ్చుటయుఁ, బుష్కరిణీతీరంబున
బ్రహ్మాదులు తపంబు సేయుటయు, శ్రీవేంకటేశ్వరుండు విమా