పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

115


వఱలును భూలోకవైకుంఠమన నేను
        నిలిచితి గావున నెలమి నిటకుఁ
దూర్పున నలరెడు దురితఘ్న యౌ సువ
        ర్ణముఖరీతీరంబు రహిఁ జెలంగఁ


తే.

బ్రబల భూలోకకైలాసరాజ మనఁగ
నలరు పుణ్యస్థలంబునం దెలమి నుండు
మని వచించి యగస్త్యుని గని ముదంబు
దనర నిమ్మెయి ననియె దైత్యారి యపుడు.

139


తే.

పరమపావన కుంభసంభవమునీంద్ర!
నీకుఁ దగినట్టి యెడఁ జేరి నిష్ఠ మెఱయఁ
జిరతరంబుగఁ దపమొప్పఁజేయుమనుచుఁ
జెప్పి సనకాదిమునుల వీక్షించి వల్కె.

140


తే.

యోగివరులార మీరు విరాగమహిమ
నరసి జ్ఞానామృతము గ్రోలి పరమతృప్తి
నొంది యిష్టావిహారులై యుండుఁ డంచు
సంతసంబందఁ బల్కె నాచక్రధరుఁడు.

141


వ.

అనంతర మాబ్రహ్మరుద్రేంద్రాది కుంభసంభవ సనకాదుల
కివ్విధంబున నానతిచ్చి శ్రీభూనీళా సమేతంబుగ నంతర్విమా
నంబునందుఁ బ్రవేశించె. నావల బ్రహ్మ మరాళ వాహనం
బెక్కి సత్యలోకంబుస కేగె. నింద్రుఁ డైరావతంబు నెక్కి
దివంబునకుం బోయె. నందిని గూర్చుండి రుద్రుండు కైలా
సంబున కరిగె. నగస్త్యప్రముఖులైన మునులుసు సనకాదు
లును స్వామిపుష్కరిణికి నుత్తరభాగంబున నుండుపాపవినాశ