పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

114

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


బాధింతు రట్టిపాపాత్ముల శిక్షింతు
        దుష్టుల మర్దింతు శిష్టజనుల
రక్షించుకొఱ కీధరాధరమున నుందు
        నిఁక నీవు పోయి యింపెసఁగ సత్య


తే.

లోకమున కేగు నిన్నెప్డు శ్రీకరముగ
బ్రోచుచుండెద సకలముఁ బొందుగాను
సృష్టిసేయుచు నుండుము దృష్టివిడక
యనుచుఁ బల్కుచు శక్రుని కనియె నిట్లు.

135


ఉ.

పాకవిరోధి! నీవు సురవర్యులఁ గూర్మిగఁ గూడి వేడ్కతో
నాకముచేరి యచ్చట ఘనం బగుబాహుబలంబు పెంచి ము
ల్లోకము లేలు దైత్యులకు లోగి చరింపకు మింక ధీరుఁడై
యేకలుషంబు లేక జయ మేడ్తెఱ నొందుచునుండుమెప్పుడున్.

136


ఆ.

అనుచు శ్రీనివాసుఁ డనిమిషపతి కిట్టు
లానతిచ్చి నెయ్య మలర శివుని
గాంచి మందహాసకలితాస్యుఁడై చూచి
యిట్టు లనియెఁ బ్రీతి యెసఁగ నపుడు.

137


శా.

గౌరీనాయక నామహోత్సవములు గల్పించి సానందులై
యారూఢంబుగఁ జేరి చూచితిరి నే నానందముం బొందితిన్
శ్రీరమ్యంబగువెండికొండపయి సుప్రీతిం దగన్ భక్తులన్
గారుణ్యంబున బ్రోచుచుండు మిఁకఁ బోకందర్పవైరీతగన్.

138


సీ.

వైకుంఠమునకంటె వరసుధాంబుధికంటె
        లలి దివాకరమండలమునకంటె
ధన్యమైనట్టి శ్వేతద్వీపమునకంటె
        శేషాచలంబు విశేషమగుచు