పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

113


సీ.

అన విని హరి యిట్టు లనియె నీమాట స
        మ్మతమ నా కింకొకమతము గలదు
విను మది నాయందు విశ్వసించుచు భక్తి
        సల్పుచు నున్నట్టి సాధువులను
బాధించువారు మద్బాహుసమానులై
        యెసఁగిన వారికి నెగ్గుచేతు
నన్నెవ రేమి యన్నను నే సహింతును
        భక్తుల నన్న నోపను జగాన


తే.

జయుఁడు విజయుండు సనకాదిసంయములకు
మించి చేసిన యపకృతి కొంచెమేని
గొప్ప యై వారలను నేలఁ గూల్చినట్టి
సరణి నే నన్నమాటకు సాక్షి గాదె.

132


ఉ.

భాగవతాపచార మతిపాపము గావున నట్టిద్రోహమున్
లోఁగక చేయువాని యమలోకమునం బడఁద్రోతు వాని నే
నేగతి బ్రోతు నింక మఱి యెన్నియఘంబులఁ జేసివచ్చి నీ
వేగతి యంచు న న్నిచట వేఁడినదీనుని గాతుఁ బద్మజా.

133


క.

వరభక్తుల నిందించిన
నరులను గురుదూషకులను నమ్మినవారిం
బరమాపదలకుఁ ద్రోసిన
నరకంబులఁ ద్రోతుఁ గాని నయపద మియ్యన్.

134


సీ.

అతిశయదంభ దర్పాద్యభిమాన దు
        రాచార ఘోరదురాగ్రహముల
నలరుచుండెడు మర్త్యు లాసురాంశజులు గా
        వున సురాంశజు లైన జనులనెల్ల