పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

107


మొనసి వైష్ణవకోటి గని భక్తిఁ బాడుచుఁ
        బరవశత్వము మీరఁ బరగఁగాను
తత్వవాదులును భేదశ్రుతిసార మీ
        దేవతోత్తముఁడని తెలియఁగాను


తే.

జెలఁగి హరికీర్తనలు కవు ల్జెప్పఁగాను
పండితులు విని శ్లాఘించుచుండఁగాను
బ్రాహ్మణస్త్రీలు పాటలు పాడి హరికి
నెయ్యమున మంగళారతు లియ్యగాను.

116


సీ.

పరమభాగవతులు భక్తిమైఁ బాడుచు
        నుప్పొంగి యాడుచు నుండఁగాను
గరములు ద్రిప్పి భోగస్త్రీలు ముందఱ
        జతలుగ నృత్యము ల్సలుపఁగాను
గ్రమముగ వంది మాగధ సూతబృందము
        ల్పురుషోత్తమునికీర్తిఁ బొగడఁగాను
శిరములఁ గలశము ల్జేర్చి కొందఱు భక్తు
        లొక్కెడఁ బ్రేంఖణ ల్ద్రొక్కఁగాను


తే.

మొనసి కొందఱు గోవింద యనుచు భక్తి
పరవశత్వముచే మించి పలుకఁగాను
రథముపై నక్షతల ననురాగయుక్తి
సతులు మేడలపైనుండి చల్లఁగాను.

117


వ.

ఇట్లనేకు లనేకవిధంబులుగ వినోదించుచు వినుతించుచు
భక్తి మెఱయింపుచుండఁగఁ గనక కమల సుగంధ పుష్ప
మౌక్తిక హారంబులం దులతూగుచు మేరుసమానంబగు
తే రానంద నిలయంబునకుఁ బ్రదక్షిణంబుగ వచ్చి యథా