పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

105


తే.

ప్రబలచక్రము సేనాధిపతియు నడువ
మునులు ససకాదియోగులు మొనసి వొగడ
ఛత్రచామరములఁ బూని సకలదేవ
గణములు న్గొల్వ వీథుల గడు ముదమున.

112


సీ.

అఖిలవైభవములు నానందనిలయంబు
        నకుఁ బ్రదక్షిణముగ నలినభవుఁడు
శ్రీహరి వేంచేపుఁ జేయించికొనిరాగ
        విఖనసుఁ డటు శాస్త్రవిహితముగను
వారక వేడ్క ధ్వజారోహణము చిత్త
        యందొనరిచి రాత్రియందుఁ బరఁగ
నావాహన మొనర్చి యానాఁటఁ గోలె దీ
        క్షను దగి యగ్నిని దనర నునిచి


తే.

సకలదైవత్య సార మాత్మికము లనఁగఁ
దగినహోమము లొనరించి తక్క కపుడు
నిత్యహోమంబులం జేసి నెమ్మిమీఱఁ
జక్రమును వాద్యములతోన వక్ర మలర.

113


వ.

దిగ్బలులతో వేంచేపు చేయించి రథము వెంట శేషవాహ
నంబుమీఁద శ్రీనివాసుని నాసీనుం జేసి విమానంబునకుఁ
బ్రదక్షిణంబుగ ననేకసేవకులతో నుత్సవం బొనరించి
యజుండు హరిని స్వస్థానంబునకుఁ జేర్చి యనంతరంబు నవకల
శపాలకారాధన నైవేద్య హోమచక్ర బలి ప్రముఖ
నిత్యకృత్యంబులు నిర్వర్తించి యలఘుశేషవాహనోత్స
వంబు గావించిన మరునాఁ డుదయంబున లఘుశేషవాహ
నోత్సవంబును, దద్రాత్రి హంసవాహనోత్సవంబును,