పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

100

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


కులు కులద్రోహు లెంచఁగ గురులదూఱు
వారు మాత్సర్యకలితులు వసుధ మఱియు.

96


వ.

జారచోరప్రవర్తకులు, స్వకన్యకావిక్రయాసక్తులు, దేవతా
రాధనాదులకు నయిష్టులు, సాధుజనుల బాధించువారలు
కావున వారివారికర్మవిధులం బరికించి రక్షింపవలయు ననిన
నాహరి విని కుమారుం జూచి నీయిష్టం బొక్కింత గొఱంత
సేయక యీ శేషగిరీంద్రంబునందు వసియింతు వైకుంఠపురం
బున నుండి సకలతీర్థంబులకు స్వామినియై వెలయు పుష్కరిణి
యీశైలమునందుండ నట్టిపాతకు లీపుష్కరిణియందు
నత్యంతభక్తి గ్రుంకు లిడిరేని వారి పురార్జితకలుషచయం
బెల్ల నశింపదె. వారి యభీష్టంబులు పరిపూర్ణంబు లగుచుండు
ననినం జక్రిం జూచి యజుం డిట్లనియె.

97


క. దనుజులు భూలోకంబున
ననుపమ గర్వంబు మించి యటవుల గిరులం
దున నిల్చి బాధ పెట్టెద
రనఘా తద్బాధ మాన్పు మలజనములకున్.

98


తే.

అనిన నాచక్రపాణి నయంబు మెఱయఁ
జక్రమును జూచి యిట్లనెఁ జక్రరాజ
వివిధసాధనములతోడ వేగ ధాత్రి
కేగి రాక్షసులను ద్రుంచు మిపుడ కడఁగి.

99


సీ.

అన విని యాచక్ర మబ్జాక్షునకు మ్రొక్కి
        కుముదాది వీరులఁ గూడి వెడలి
ప్రళయకాలాభీల భానుబింబమురీతి
        సరభసంబునఁ బోయి సకలదుర్గ