పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

93


లడిగె లేదన కూర కా వరంబులు వాని
        కిచ్చితి నందున హెచ్చి వాఁడు


తే.

లంకలో నుండి సుంతైన శంకలేక
భటులఁ బురికొల్పి శ్రీగిరి ప్రాంతదేశ
ములఁ జరించుచు మునిసాధువులకు హింస
చేయుచున్నాఁడు వాడు నశించిపోఁడు.

66


ఆ.

వరము లడుగువేళ వాఁడు మానవునిచే
మడియ కుండువరము నడుగలేదు
గానవాని కంతకాలంబు వచ్చిన
తఱిని ద్రుంచు నరుఁడ తథ్యమనుచు.

67


క.

సరసిజగర్భుఁడు వల్కిన
హరి దరహసితాస్యుఁ డగుచు నప్పు డగస్త్యుం
గరుణం గనుఁగొని మౌనీ
శ్వర నీ విపు డిచటి కేల వచ్చితి వనఁగన్.

68


ఉ.

అప్పు డగస్త్యమౌని గమలాక్షుని సన్నుతి చేసి యిట్లనెన్
ముప్పిరిఁగొన్నగర్వమునమూర్ఖు దశాస్యుఁడుమర్త్యకోటులం
దెప్పునఁ ద్రుంచుఁగాన జనదీనదశం గనలేక తత్క్రమం
బిప్పుడు మీకుఁ జెప్పఁ దగు హేతువు గల్గఁగ వచ్చితీశ్వరా.

69


ఆ.

రావణాఖ్యుఁ ద్రుంచి ప్రజలను రక్షించి
మమ్ముఁ గావుమంచు మౌనివరుఁడు
విన్నవింప నగుచు విని యప్డు సనకాది
యోగివరులఁ జూచి శ్రీగురుండు.

70


ఆ.

ఆదియోగు లగుచు నానందమున నుండు
వారు మీరు కోరి వచ్చినట్టి