పుట:శ్రీరమాపరిణయము (తరిగొండ వెంగమాంబ).pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్విపద కావ్యము

41

వరుసగాఁ గైకొని, - వారికి వివిధ
వరములిచ్చుచు, మహా - వాత్సల్యమునను
నా పాలి తరిగొండ - నరసింహుఁడగుచు
శ్రీ పన్నగాద్రిపై - స్థిరముగా వెలసి,
నా పెన్నిధానమై - నైజమోక్షంబుఁ
జూపుచు, ననుఁ దన - సొమ్ము చేసికొని,
కుదురుగా నన్నేలు - గురుఁడు తా నగుచు,
ముదమొప్పఁ దత్త్వార్థ - ములను దెల్పుచును,
అలమేలుమంగతో - నానందముగను 780
సులలితలీలల - సుఖియింపుచుండె.

కృతి సమర్పణము


అని యిట్లు శేషాచ - లాధీశుఁడైన
కనకాంబరుని పేరఁ - గమలేశు పేర
వలనొప్పుఁగా నంద - వరకులోద్భవుఁడు
చెలువొంద నమల వా - సిష్ఠ గోత్రుండు
వసుధలోఁ గానాల - వంశవర్ధనుఁడు
రసికుఁడౌ కృష్ణార్యు - రమణి మంగాంబ
సుత వెంగమాంబ భా - సురభక్తితోడ
ప్రతిలేని శ్రీరమా - పరిణయం బనెడి