పుట:శ్రీరమాపరిణయము (తరిగొండ వెంగమాంబ).pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్విపద కావ్యము

39

బొలుపొంద, మే మింకఁ - బోయి వచ్చెదము
నిలువు! నీ పతి చెంత - నీవు వేడుకను'
అని బుజ్జగించి, నె - య్యంబు రెట్టింపఁ
దన వధూమణుల నం - దఱఁ జేరఁబిలిచి,
వారిచే శ్రీరమా - వనిత కావేళఁ
గూరిమి బహురత్న - కోటు లిప్పించి,
మురువొప్పఁ గౌస్తుభ - ముఖ్య సన్మణులు
హరికి సమర్పించి, - యతిభక్తిఁ బెంచి
చెలువొప్పఁ జక్రికి - సిరి నొప్పగించి, 740
బలు జాలిమాలితోఁ - బలికె నిట్లనుచు:

సాగరుని మనవి


శ్రీశేషగిరివాస! - చిరదరహాస!
వాసిగా నా మీద - వాత్సల్య ముంచి,
పసిబిడ్డలైన నా - పట్టిని నీవు
కుశలంబుగా నేలు - కొనుము! సత్కృపను,
తప్పొప్పులను మీరు - దయతొ మన్నించి,
యుప్పతింపక ప్రోచు - టుచిత మీ సతిని,
నీలనిభాకార! - నీళ్లలో ముంచు,
పాలలో ముంచు నీ - భార మీమీఁద'
అని యొప్పఁ జెప్పి, చిం - తాక్రాంతుఁడైన 750
వనధి కిట్లని పల్కె - వాసుదేవుండు :