పుట:శ్రీరమాపరిణయము (తరిగొండ వెంగమాంబ).pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్విపద కావ్యము

27

ఇంక మాట్లాడకు - మింతియే చాలు! 500
శంకర! బోసేయు - సంతసంబుగను
అని పకపక నవ్వె: - నప్పుడా హరినిఁ

సాగరుని సమన్వయము


గనుఁగొని పలికె సా - గరుఁడు నవ్వుచును:
'జలజాక్ష! నీవును, - శర్వాణి విభుఁడు
బలవంతు, లానంద - భరితు, లన్నిటను
ఒక్క రొక్కరికన్న - నుత్తమోత్తములు.
తక్కక మీకు భే - దము లేదు గనుక
మొనసి నవ్వులకు బల్ - ముచ్చట మీఱ
ననుకొంటి రీమాట -లానందమగను.
జలజాక్ష! మితిలేని - జలజజాండములు 510
పొలుపొంద నెపుడు నీ - బొజ్జలో నుండుఁ
గావున, నీకు నాఁ - కలి దీరఁ దృప్తి
గావింప మేమెంత - గలవార మరయ?
మాకుఁ గల్గిన యంత - మాత్ర మీవేళఁ
జేకొని నీవు భు - జింపవే!' యనిన,
జలజాసనాదులా జలరాశి మాట
కలరుచు 'మేలు! మే!'లని మెచ్చి రపుడు.
హరిహరుల్ ముదమంది -యందటితోడఁ