పుట:శ్రీరంగమాహాత్మ్యము.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

77

గీ. పలుకుమన పుట్టయిట్టుతాపసినిఁ జూచి, తీర్ధములు జూడవేడి ధాత్రిని జరించి
      మీరలున్నారు కావేరి తీరములను, ననుచుఁ గొందరుమునులు తెల్పిన కతమున.
క. వచ్చితిమి వేడ మునివరు, లిచ్చట లేఁ డనెడువారు నెచ్చటనుండో
      వచ్చుననువారుఁ జూచితి, మిచ్చట ననువారు నగుచు నందఱుఁ బలుకన్.
క. వినివచ్చి మిమ్ముఁ గంటిన్, జననంబుఁ గృతార్థమమ్యె సఫలంబయ్యెన్
      దనతన మాచార్యోత్తమ, మనమున నానందవార్ధిమగ్నుఁడ నైతిన్.
క. ఇచ్చటి శశిపుష్కరిణియు, యిచ్చటి రంగేశుసేన నిచ్చటి నదియున్
      వచ్చి కనుంగొను సుకృతము, వచ్చి మిముం జూపె భాగ్యవశమున నాకున్.
గీ. ఎన్ని తీర్థంబు లిచ్చోట నున్న నందు, నాశ్రయించి కృతార్థులైనట్టివార
      లెవ్వ రానతినిండన్న నిట్టులనియె, నాభరద్వాజమౌనికి నాదిసుకవి.
కి. ఏనాడు విభీషణుండను, దానవపతి నిలిపె రంగధామము నిచటన్
      యేాఁటనుండి నాయక, యీ నెలవున నున్నవాఁడ నిచ్ఛారతినిన్.
క. కలవారి పుణ్యతీర్థం, బులు రంగక్షేత్రనికటభూముల దానం
      దులలేని మహామహిమము , లలవడ నశ్వత్థతీర్థ మాద్యం బయ్యెన్.
మ. కన దశ్వత్థము చెంత మాధవియనంగా నొక్క కన్యామణీ
      తిలకం బాసరసిన్ మునిగి శుచియై తీరంబునన్ తాలి పు
      వ్వులు శృంగారవనంబులన్ నెరసితావుల్ గట్టి రంగేశు కో
      వెలకర్పించుచు నుండె దీర్థనికటోర్విబ్రహ్మచర్యంబునన్.
మ. ఉటజావాసమునం దపోనిరతమై నుత్తుంగవక్షోజలం
      పట మీక్షింపకయున్ననే తనదు మీపానీయకుంభంబుచే
      నెటు కానో యన కాసరోవరబలం బేప్రొద్దు నశ్వత్థనై
      కటికానాలమునందు నింపుచును రంగస్వామి భావింపుచున్.
క. ఉండునెడ గానరావే, దండింపకుమయ్య తాళజాల ననాథన్
      రండెవ్వరైన నడ్డము, గండను నార్తస్వనం బొకటి చెవి సోకెన్.
క. ఆకాశవీథి నేడ్చుచు, నీకరణి బలు కనాథయింతిరవముగా
      నాకర్ణింపుచు వెరవకు, మోకమలేక్షణ భయంబునొందకు మనుచున్.
క. అయ్యా యన్యాయంబును, నియ్యార్తరవంబుదాన నెవ్వతెవే నీ
      కుయ్యాలించియు బ్రోచెద, నెయ్యది నీజాడ యహితులెవ్వ రటంచున్.
క. గగనమున జూడ దానిం, బిగగట్టుకొ కొట్టి కొట్టి బెదరింపుచు నో
      సి గయాళి నీకు నోరా, వగలించిన విడిచిపుచ్చువారమె నిన్నున్.