పుట:శ్రీరంగమాహాత్మ్యము.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

61

క. పొమ్మని హరి యంతర్ధా, నమ్మున బొందుటయు నట్ల నలినారియు భా
      వమ్మున బ్రమోదమంది ప్రి, యమ్మున నీలోకమునకు నరిగె మునీంద్రా.
సీ. వినుము తెల్పెద నొక్కవృత్తాంత మాచంద్రపుష్కరిణీతీర్ధ పుణ్యమహిమ
      యది దశయోజనాయతమయి కృతవేళఁ బొగడొందు నందునసగము త్రేత
      నందర్ధమయ్యె ద్వాపరమున గలివేళ నందులఁగడమ నిల్చె
      నపరాహ్ణమున గమలాప్తురికిరణముల్ సమయపోలికవిన సంగతులను
      నాడునాటికిఁ గురుచతనంబు గాంచె, నందు నీరంబు నమృతతిల్యంబు లయ్యె
      పూర్వమధురంబులై రుచిపుట్టి తేట, లై కలకలై యుగంబుగ నతిశయిల్లు.
క. కావలిగా యుండిన భూ, తావళి కలివేళయందు నంతర్ధానం
      బై వరలు రాజవిజయము , లౌ వేళ గషాయితంబులై కలగలుగున్.
క. హెచ్చిన ప్రజాక్షయంబుల, పచ్చనివర్ణములవేళ పసరువిధమునన్
      గొచ్చుపడి ననావృష్టి స, ముచ్చరికమహత్వమ ద్విమోఘం బెల్లన్.
క. యోజింపగ ద్వాత్రింశ , ద్యోజనవిస్తార మగుచునుండున్ గావే
      రీజలపరివృతసికతా, రాజద్వీపంబు రంగరాజాకరమై.
చ. ప్రతియుగమునన్ దదర్ధపరిపాటిఁ గవేరితమంబు లొల్చు జీ
      ర్ణతఁ గలివేళ తేరుగడ నాశమునొందుదు రెల్లవారలీ
      క్షితి నది రంగవాసుఁడు నశించినపిమ్మట సర్వమంగళా
      యతను సమృద్ధిబొల్పెసఁగ నాద్యపరిగ్రహ మట్టిదేకదా.
సీ. ధర్మేతరులు క్రూరకర్ములు పాషండు లాగమనిస్ఠకు లార్యభయదు
      లత్యంతలోభులు కృత్యపరాయణుల్ విష్ణుదూషకులైన వైష్ణవులను
      ప్రేతకూష్మాండకభేతాళికాపిశాచాఢాకినీరాక్షసవ్రజంబు
      కలియుగాంతమున దుష్కథలు పాపాత్ములై విని రుద్రు సేవించు వీరినెల్లఁ
      గర్త పశుపతి గజముఖు కాళి గొల్చి, యుండుదురు రాజసగుణులు నుర్విలోన
      మానసులు సాత్వికులు దృఢజ్ఞానవిదులు, వైష్ణవులు లేరు నాటికి వసుధ నెచట.
గీ. రావణు హిరణ్యాక్షు హిరణ్యకశిపు, బాణు నరకాదు లద్రిజాభర్తఁ గొలిచి
      మెలఁగుకైవడిఁ దా మహాత్ములకు నట్టి, సాత్వికవినాశమును కలిసంధి వొడము.
గీ. అపరము పరంబనియనినందు నీశ, బుద్ధినిడి సత్తసత్తని బోల్చు జ్ఞాన
      మనుచు నజ్ఞాన మెంచి భూజనులు జెడఁగ, దా నుపేక్షించి యుండు పద్మావిభుండు.
గీ. మోహతామసశాస్త్రసముత్కరంబు, హరుఁడు గీలించి ధరణి జనాళిఁ జెరుప
      గడగి లింగప్రవర్తకుల్ గాఁగఁజేయు, రంగధామంబు ధరణికి రాకమునుపు.