తృతీయాశ్వాసము
49
క. నాయాజ్ఞ దాటి యంతలు, సేయఁగ నెవ్వారు గలరు శ్రీసృష్టిని వా
రేయెడ దాగన్నేరుతు, రీయత్నముఁ జేసి కాచు నెవ్వరు వారిన్.
మ. అని యాలోచనఁ జేసి కాకనుచు మీ రాసహ్యజాతీరభూ
మిని శ్రీపుష్కరతీర్థ మున్నదియ యమ్మేరం జుమీ రంగధా
ముని తాఁ దెచ్చి విభీషణుం డునిచె నమ్ముద్రాధికారుల్ మిముం
గినుకంగొట్టిరె మోసమయ్యెనని తా కేల్మోడ్చి కన్మూయుచున్.
క. భావించి పసిఁడిగుదియలతో నవమాలికలతో చతుర్భుజములతో
శ్రీవరులు ముచ్చుదాసరి, తో వైష్ణవు లచటనుండ దోఁచె న్మదికిన్.
చ. తరణితనూజుఁ డిట్లు హరిదాసుల చంద మెఱింగి యక్కటా
యెఱుఁగక పోతి రచ్చటికి నెన్నటికిం గఱిగట్టి మీరలా
తెరఁగున మెల్గఁగావలదు తెల్పితిఁ దెల్పితి రంగధాముఁ డా
పొరుగున నిల్లుగట్టుకొనె పుష్కరతీర్థముఁ జేరవచ్చునే.
క. శ్రీరంగయోజనార్థము, చేరకు డెన్నటికి నచటిజనులున్ జ్ఞానా
ధారు లిఁక బ్రతుకవలసిన, మీరెఱుఁగకఁ బోయెదరుసుమీ యని పలుకన్.
గీ. వారలును గొల్వులో నున్నవారు వెరచి, అయ్య తలవట్టి చూచుకొన్నట్టులాయె
వార లెటు వోయె రేమి శ్రీవైష్ణవులును, డాయవలసిన మీరాజ్ఞ సేయుఁ డెపుడు.
క. వీటికి సహ్యజలోపల, నాటె విభీషణుడు రంగధాముని సరసుల్
కోటులుగల్గియు పుష్కర, మేటికి నుతిగాంచె నానతిండని పలుకన్.
క. తెలిపెదను తాళుఁడని కర, ములు కన్నులు మొగిచి రంగమును రంగేశున్
దలఁచి తలంబున తా సా, గిలి మ్రొక్కి యథావిధి స్వకీయుల కనియెన్.
ఉ. మా కేిది సర్వశోభనకరంబు వినుం డుపనీతిఁ బల్కినా
రీకథ యవ్విభీషణుఁ డనేకులు మౌనులు వేడునట్లనన్
లోకములన్నియుం దనదులోనిడి యొక్కఁడు నిల్చి దుగ్ధనీ
రాకచలోలవీచికలయందు భుజంగమతల్పశాయియై.
గీ. ఆదినారాయణుఁడు పరమాత్ముఁ డవ్య
యుండు సకలాత్మకుఁడు చిన్మయుఁడు మొదలు
సృష్టి కుద్యుక్తుఁడైన రాజీవ మొకటి
నాభియం దుదయించె సనాతనముగ.
మ. కలిగెం దత్కమలంబులో కనకభృంగప్రాయుఁడై వింతగా
నలుమోము ల్గల వేల్పుపెద్ద యతఁ డన్నాళీకగర్భంబునన్