పుట:శ్రీరంగమాహాత్మ్యము.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

23

క. చక్కని తామరలకు మొన, యెక్కుడుగల మీసదంబు లెక్కడ కెలనన్
      మ్రొక్కఁగ జేరిన నా శిర, మెక్కడ యీమొక్కళమున డేమన నేర్తున్.
క. కావేరిమీఁద నూరక, యే వెఱ్ఱినిగాక యలుగనేల యలిగినన్
      మీవాక్యము లౌ గాదని, నేవాదించుటకు నన్ను నేమందు హరీ.
చ. బలిమిని నిన్ను నాదుకనుపండువుసేయుట నీవు భక్తవ
      త్సలుఁడవుగాన నాకనువు సాగఁగజేసితి వింతమీఁద మీ
      తలఁపున నెంచినట్టి దయతప్పదు నాకు నభీష్ట మట్ల కా
      దలఁచితినంచు గేల్వదలితాఁ బ్రవహింపగఁజేసె సహ్యజన్.
క. కరుణింపు మనుడు శ్రీహరి, వరమిచ్చెద వేడుమనిక వరమిదె నాకున్
      ధరణిగల పుణ్యతీర్థము, లరసేయక నిమ్ము నీమహానదిలోనన్.
గీ. ఇచట మనుజులుగావించు నెట్టిదాన, మైన నొక్కటికొకటిగా నసుము లెల్ల
      దూరమైపోవ వారు నీవారు గాఁగ, భుజగశయన యనుగ్రహబుద్ధి యనుపు.
గీ. అనుఁడు నట్టులవర మిచ్చి యాప్రథాన, పురుషుఁ డవ్యయుఁ డనియె సుబోధ నీకు
      నిటుల సన్నుతిఁ జేసితి నేనెసుమ్ము, వాసుదేవుఁడ శ్రీరంగవల్లభుండ.
క. ఖగరాజయానసుఖముల, నగుదున్ బ్రత్యక్ష మచ్చటచ్చటగొని ప
      న్నగరాజయానమున నా, లుగుమొగములవేల్పు నింటిలో వసియింతున్.
ఉ. అంతియకాని యెవ్వరు ననంతశయానుని నన్నుఁగాన రీ
      నెంతటిభాగ్యశాలివికదే పొడకట్టితి నిట్టిమేన నా
      చెంతన రంగమందిరము జేరి మదిన్ భజియింపుచుండు ని
      శ్చింతతనన్న నమ్రుఁడయి చేతులు మోడ్చి సుబోధుఁ డిట్లనున్.
క. ఓకమలేక్షణ పరమద, యాకరమగు దివ్యమంగళాకారముతో
      లోకేశు నింటిలోపల, నేకతమున నిల్పి తానతిమ్మని పలుకన్.
శా. ఏ నాచే సచరాచరాత్మకవిధం బీవిశ్వ ముత్పన్నమౌ
      యే నాకన్యము లేదొకప్పుడు సమస్తేలాస్థితిం జూచుచో
      నేనన్నన్ బరమాత్ముఁడంచు శ్రుతులే యేవేళ ఘోషించు నీ
      వా నన్నున్ వినవేడిపల్కితివి నీకాద్యంతమున్ దెల్చెదన్.
ఉ. శ్రీయుతమై మదీయమగు క్షీరపయోనిధిలోన నాదినా
      రాయణ ముఖ్యనామక మనంతములౌ నిజమూర్తినున్న న
      న్నాయజుఁ డాత్మలో నిలిపి యబ్దసహస్రము లుగ్రతం దపం
      బాయతభక్తి జేయుటయు నందుకు మెచ్చి కృపావిభూతితోన్.