పుట:శ్రీరంగమాహాత్మ్యము.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దశమాశ్వాసము

157

గీ. తోడు శ్రీరంగనాంచారుతోడఁ గూర్చి, లీల నొరయూరునాంచారు నేలె సరణి
      సమయకారతముఖ్యవాంఛలును దేల్చె, వింత యొకటున్నయది నాగదంత వినుము.
సీ. శ్రీమహనీయమౌ శ్రీవిల్లిభుత్తూర విష్ణుచిత్తుం డను వేదవేత్త
      కలఁ డొక్కవైష్ణవాగ్రణి యమ్మహాతిరుపతి నున్న శ్రీవటపత్రశయనుఁ
      గని కొల్చి మాలికాకైంకర్య మొనరించి మత్స్యధ్వజునిఁ జేరి మధురలోన
      విద్వజ్జనము విశిష్టాద్వైతసుప్రతిష్ఠయు నొంది శౌరి సాక్షాత్కరింప
      నలరి తనవిభుఁడు జేకి కృతార్థుఁ డగుచు, దినములు గ్రమింప నొకనాఁడు వనములోన
      దులసికాననసీమ కన్నులు జెలంగ, నెట్టిదో పుణ్య మొకముద్దుపట్టిఁ గనియె.
ఉ. చామనచాయ మేనుగల చక్కని యన్నున నట్టిచూచి చే
      యామరకెత్తు నేర్పున సమంచితలీలల హస్తపద్మమున్
      బ్రేమ గ్రహించి సంతతము బ్రీతి జెలంగగ రంగధాముఁ డు
      ద్ధామగతిన్ సమస్తజగదావనదీక్షితుఁ డత్తఱిన్ గృపన్.
ఉ. అందఱు రాణివాసముల యక్కఱ లిక్కువముల్ స్వభావముల్
      కందువ లిచ్చలుం దెలిసి కామితివస్తు లొసంగి బ్రోచి తా
      నందఱ కన్నిరూపులయి యార్తశరణ్యుఁడు రంగధారుణీ
      మందిరుఁ డుర్వియేలె నసమానమహామహిమానుభావతన్.
సీ. శ్రీరంగనాయకుఁ డీరీతి నలరుచు ననుదినపక్షమాసాబ్దవిరచి
      తోత్సవంబుల మించి యొకమాటు తనుఁ జేరుకొనువారలకు నెల్లకోర్కు లొసంగి
      యవని నాద్యస్వయంవ్యక్తవిమానమౌ గంగసౌంజ్ఞిక మను నాగకథల
      తెలివిదైన ప్రధానతిరుపతి విలసిల్లె నని నాగదంతుతో వ్యాసమౌని
      తెలిపెనని శౌనకాదిమౌనులకు సూతుఁ, డిటు శ్రీరంగమాహాత్మ్య మేరుపరుస
      వారలెల్లఁ గృతార్థులై మీరి యుభయ, లోకసౌఖ్యము లంది రస్తోకమహిమ.
మ. నరు లీదృగ్విధమైన గారుడపురాణప్రోక్త పద్యావళిన్
      జరణంబైన లిఖించినన్ జదివినన్ జర్చించినన్ బల్కినన్
      బురుషార్థంబులుఁ గామితార్థములు సంపూర్ణాగమస్థైర్యముల్
      పరమాయుర్విభవాంగనాయత సుసౌభాగ్యావళుల్ జేకురున్.
మ. తతకళ్యాణకలాపసేవకజనానందస్వధాపాంగసం
      శ్రితభోగప్రదపాదపద్మభజనక్షేమంకరా వైభవా