పుట:శ్రీరంగమాహాత్మ్యము.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

గీ. ఇచ్చవచ్చినప్పు డేవేళ నెయ్యెడ, నేమి సేయవలయు నీశ్వరునకుఁ
      దలఁచినపుడుఁ బుట్టి తానట్లు గావించు, పాయ డెపుడు వైనతేయుఁ డతని.
ఉ. తాబుధరక్షణార్థమయి దానవభేదినినుండు జాయమా
      నోబహుధాయనన్ శ్రుతివినుం డటుగావున తార్క్ష్యుఁ డిద్ధ తే
      జోబలశాలియై పొడముచున్ హరియట్ల మలంగు నట్టివాఁ
      డే బహుపుణ్యసంహిత మహిన్ వెలయన్ రచియించెఁ గంటివే.
వ. అన నమ్మౌనులు దేవ! పద్మభవ! మీ రవ్వైనతేయు న్నుతించిన మావీనులు
      చల్లనయ్యెను. జగన్నిర్మాణతం కాశ్యపేత్వ నిరూఢం నినుబోల నాతఁడు త్ర
      యీవర్గంబు మీరిర్వురందును పూర్ణంబులుగాగ నిల్చినవి యెన్నున్నిమ్ము త్రై
      యంత్రములు.
గీ. వైనతేయుని శ్రీపాదవనరుహములు, భక్తి సేవించి తత్కృతి ప్రౌఢిమంబు
      విని కృతార్థుల మగుట యవిద్యమాసె, మిమ్ము భజియింపఁగలిగినఁ బుణ్యమ్ము గాదె.
క. అని వినుతించిన వారిం, గని దీవనలిచ్చి ధాత కలహంసముపై
      జనియె న్వేల్పులు గొల్వఁగ, మునులయ్యధ్వరము సాంగముగఁ గల్గుటయున్.
క. అచ్చోట వాసి నలసిన, యిచ్చలఁ జనిరందునుండి యేనిచ్చటికిన్
      వచ్చితి నీకథ దెల్పెద, ముచ్చటమీఱంగ వినుము మునివర యనుచున్.
క. కరయుగముఁ గన్నుఁదమ్ములు, నర ముగిచి రమేశు నీశు నచ్యుతుని మదిం
      స్మరణ మొనరించి గారుడ, పరమపురాణంబు శక్తిపాత్రుఁడు తెల్పెన్.
మ. విను మీప్రశ్నకు నాగదంత యపుడీవిశ్వంబు బ్రహ్మంబునం
      దునె యుత్పత్తియు వృద్ధియున్ లయము నొందున్ బ్రహ్మ మాధారమై
      దనరున్ సర్వచరాచరాత్మకును నిత్యంబైన లోకాళికె
      ల్లను జన్యంబులఁ దారతమ్యవిధు లెల్లం గర్మతద్రూపముల్.
గీ. అట్టిబ్రహ్మంబు భగవంతుఁ డనఁగ విష్ణు, డనఁగ నారాయణుండన నతిశయిల్లి
      ఇది బహుళరూపకత్వాభయంబుగాన, బ్రహ్మ మనుపరిదాత్యమై పరిణమించె.
క. ఘృతకోశాతకి నుదుటకుఁ, బ్రతిమంబై యితరులకును బ్రహ్మత్వంబుల్
      బ్రతిపాద్యమయ్యు నీశ్వరుఁ, డతంఁ డొక్కఁడ బ్రహ్మమనఁగ నభినుతిఁగాంచున్.
శా. ఆయీశుండు బ్రపంచనిర్మతికిఁ దా నాది న్మహాపూరుషున్
      ధీయుక్తిన్ సృజియించె భూతబహుధానిర్మాణశక్తిప్రభా
      వాయత్తప్రకృతిన్ సృజించె నతఁ డందావిర్భవించన్ దమం
      బాయం దజ్జనితంబహూకరణమం దయ్యెన్ గుణవ్రాతముల్.