పుట:శ్రీరంగమాహాత్మ్యము.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దశమాశ్వాసము

149

      పరగపడమటినెరసంజబంధుజీవ, ఘుసృణకంకేళి దాడిమీప్రసవకింశు
      కప్రవాళజపారాగగైరికాగ్ర, కిసలకిలయితగప్రభాగ్రసన మగుచు.
మ. అపు డామౌనిగణంబు కాల్యకరణీయంబుల్ చనన్ దీర్చి రం
      గపురాణశ్రవణప్రసంగతతి రంగధ్యాననిష్ఠామహా
      జపతాతత్వనిరూఢి రంగరమణాంచత్పూజనాసక్తి రం
      గపురీతీర్థమహత్వకీ ర్తనల శ్లోకంబుల్ ప్రసంగింపుచున్.
ఉ. వేకపువేడి కాకఁబడు విశ్వము శాంతి వహించునట్లుగా
      చీకటిపేర యొక్క జపసిద్ధుఁడు గొంగడి గప్పివచ్చి యొ
      క్కూకున మంత్రభూతి పయినూదిన కైవడి తాపి పూఁబొదల్
      సోకిన రాగపూరములఁ జొక్కిలి తీర్చి సమీరవారమున్.
క. పుప్పొడి వెంబడి పూవుల్, కుప్పలుగాఁ గురిసె మౌనికుంజురుపైఁ దా
      నప్పూజ లంది తలఁచిన, యప్పుడ కనుమ్రోల గర్హితాకారములన్.
సీ. నిల్చి తద్పదపద్మముల కింతయెడగల్గి సాగిలి మ్రొక్కి యంజలు లమర్చి
      వేదోక్తముగ పెక్కువినుతులు గావించి తమ తెరఁగెల్ల మాతండ్రితోడ
      విన్నపం బొనరింప విని యేల చింతిల గౌతముండు శపించుఁగాక యేమి.
      యఖిలలోకారాధ్యుఁ డైనట్టి మాతాత యాచార్యుఁడటె మీకు నతని గరుణ
      నొక్కయక్షర ముపదేశ మొందువారు, జగతిభేదంబు లొంద ప్రసక్తి గలదె
      మిమ్ముఁ గడతేర్తు నింతకు మిగిలినట్టి, తలఁపు లేదెందు నాకు గర్తవ్య మొకటి.
క. కావలయు నర్థ మెయ్యది, యేనరము లొసంగవలయు నిదియది యని మీ
      భావములఁ గొంక నేటికి, యీ వేళ వచింపుఁడన బ్రహృష్టాత్మకుఁడై.
గీ. వరము లేటికి మీ పాదవనరుహములు, వరము లితరంబులైన దైవతులగడన
      పొడగనితినున్న యామాటనుడువ దడవ, విడిచె వారిపిశాచత్వవిభాగములు.
ఉ. చక్కఁదనంబు నంగములు చాయలు బ్రహ్మవిశుద్ధతేజమున్
      నిక్కముగాఁగఁ దొంటికరణిన్ దెరమాటుననుండి వచ్చిన
      ట్లక్కజమై యొసంగుటయు నందఱు విస్మయ మంది వారలన్
      బెక్కుతెఱంగులం బొగడి పేర్చి సుమంతసునందు లేపునన్.
క. తనసన్నిధి నిలిచినచోఁ, గని యాసక్తిఁ బ్రసూతి కరుణాపరుఁడై
      మునిబాలకులం గని యి, ట్లనియె భావ్యర్థనిశ్చితాత్మకుఁ డగుచున్.
గీ. ఈశ్వరుఁడు మేనులనియెడి యిళ్లలోన, బూనుకొనియుండు గుణరూపియైన మాయ
      ననుసరించుఁ జరించు దేవాదితనువు, లెత్తి యిందుకుఁ దగినభోగేచ్చ మెలఁగు.