పుట:శ్రీరంగమాహాత్మ్యము.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరంగమాహాత్మ్యము

97

      సామాదినిగమఘోషంబులు వీనులపర్వమై యాచాయఁ బర్వె నిపుడు
      సంతతావహనీయసమిదున్ముఖోద్ధూతధూమమాలికలు పైఁదోఁచె నిపుడు
      నగముమాత్రంబు గాదిది నాకుఁ జూడ, పద్మలోచను విశ్వరూపంబు గాని
      యచట వింతలుగలనని యాత్మఁదోఁచెఁ, జేరి చూతమెయనినఁ బ్రాచేతనుతుఁడు.
మ. అదియే కాదె కదంబతీర్థము సమస్తారాచనీయంబు నీ
      విది నీక్షింతువు గాక రమ్మనుచు మౌనీంద్రుండు వాల్మీకి యా
      హ్రదమున్ డాయఁగ నేగ నచ్చట మునీంద్రవ్రాత మర్ఘ్యాధిక
      ప్రదులైన న్నది మెచ్చి వారలను సంభావించుచు న్మెచ్చుచున్.
ఉ. కొందఱకున్ బ్రణామ మిడి కొందఱు మ్రొక్కిన నాదరించి తాఁ
      గొందఱఁ గౌఁగిలించి మఱికొందఱ హస్తవిలోచనాదులన్
      విందొనరించి వారిడ పవిత్రపవిస్తరణంబుపై ననుల్
      క్రందుగనుండ నుండి ఘను గౌతము సంయమి జూచి యిట్లనున్.
ఉ. యూపము లగ్నికుండములు హోమపదార్థములున్ సమిత్తులున్
      దాపసకోటి పాత్రలు సుదర్భలు సుక్సృవముల్ సమస్తమై
      చూపుల కిమ్మఘంబుఁ గడుంఁజోద్యముఁ బుట్ట సమాప్తిగాని యె
      ట్లే పొలు పేదియున్నయది యత్తెఱఁ గానలియిమ్ము నావుఁడున్.
సీ. అడిగితి రిందులేమనువాఁడ మీమాటఁ గాదని జవదాటరాదు గాన
      బలికెద మిథిలాధిపతి యిందు జన్నంబుఁ గావింపుచును ఋత్విగావళికిని
      బహుపదార్ధము లిచ్చి భక్ష్యభోజ్యాదులఁ దృప్తినొందింప ఋత్విగ్గణంబు
      బలుతిండిచేఁ జాలబల్మారిసోమరితనములఁ బరికరద్రవ్యమెల్ల
      మరిచి పదిలంబు సేయ నేమరి తదీయ, శాల నిద్రింప శునక మచ్చాయ నొకటి
      యిచ్చంకొచ్చి పురోడాశమెల్ల మెసవి, యాజ్యపాత్రలు దొలిపి తినంత జనియె.
క. అది యింతయు నెఱుఁగక నె, మ్మది యాగముఁ దీర్పఁబూని మంత్రము తంత్రం
      బది యిది యనిదోఁచక దిగు, లొదవఁగఁ గాశ్యపునిఁ జూచి యుల్లము గలుఁగన్.
గీ. మంత్రములు రాక యవి నడమంత్రమయ్యె, జన్న మేరీతిఁదీర్చు రాజెన్న నతఁడు
      నన్ను కొను నెమ్మనంబున నన్ను నడిగి,...................................
క. పావన కర్మంబులచే, గావింపఁగ నర్హమైన క్రతు విట్లశుచిం
      గావింప నెందుఁ దీరదు, కావున నజ్ఞాన మపుడు గప్పెను నన్నున్.
క. ఎంతటివారికిఁ దెలియని, యంతటిపని యేనుఁ దెలియ కాకశ్యపుతో
      నంత మహాశ్రేయమునకు, నెంతయు విఘ్నములుగాక యేలా మానున్.